ఇప్పుడు తొండల్ రెడ్డిగా మారారు
అంబోతు అన్నోడి దగ్గరకు పోచారం వెళ్లారు : కేటీఆర్
(నిజామాబాద్,న్యూస్ఇన్)
రేవంత్ రెడ్డి ఎప్పటికైనా బిజెపి మనిషే అని ముమ్మాటికి బడే భాయ్ తమ్ముడే అని కేటీఆర్ అన్నారు. అందుకే రాష్ట్రంలోని మైనారిటీలు, మత రాజకీయాలను వ్యతిరేకించే ప్రతి ఒక్కరూ రేవంత్ రెడ్డి కప్పుకున్న బీజేపీ ముసుగును తొలగించి చూడాలని, ఆయన లోపల ఉన్న బీజేపీ నాయకుడిని గుర్తించాలని కేటీఆర్ సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న కేటిఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై రేవంత్ పై విమర్శలు గుప్పించారు. అధికారంలో ఉన్నాం కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో మాకు ఓటు వేయాలని కాంగ్రెస్ చెప్తున్న వాదన అర్థరహితమన్నారు. అధికారంలో ఉండి గత రెండు సంవత్సరాల్లో ఏం చేశారో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు అయితే కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలు పొందిన వాళ్లు మాత్రమే ఆ పార్టీకి ఓటు వేయాలని, మిగిలిన వాళ్లు ఆ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని కేటిఆర్ పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ పార్టీలోకి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎందుకు పోయారో బాన్సువాడ ప్రజలకు సమాధానం చెప్పవలసిన అవసరం ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డిని అంబోతు అని, ఆయన కొడుకులు దున్నపోతులని ఆరోపిస్తూ…..రోడ్డు మీద వదిలారని, కాంట్రాక్టుల పేరుతో అవినీతి చేస్తున్నారని, కమిషన్లు తింటున్నారని, ఇసుక దోపిడీ చేస్తున్నారని రేవంత్ రెడ్డి చెప్పిన మాటలని కేటీఆర్ అక్కడి ప్రజలకు వినిపించారురేవంత్ రెడ్డి విసిరే ఎంగిలి మెతుకుల కోసం పోచారం కాంగ్రెస్ సంకలో చొచ్చినా వేల మంది పార్టీ కార్యకర్తలు నాయకులు ఇంకా భారత రాష్ట్ర సమితిలోనే ఉన్నారన్నారు. దమ్ముంటే ఇంత అనుభవం ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేసి ప్రజల వద్దకు రావాలని, ప్రజలు ఎవరి వైపు ఉంటారో నిర్ణయిస్తారని కేటీఆర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి సవాల్ విసిరారు. లేకుంటే బండ కట్టుకుని రేవంత్ రెడ్డి అన్నట్లు బావిలో దూకాలన్నారు. బీఆర్ ఎస్ హాయంలో దాదాపు 10 వేల కోట్ల నిధులు కేసిఆర్ బాన్సువాడ అభివృద్దికి కేటాయించారని, ఇది పోచారం చేసిన అభివృద్ధే అయితే…. గత రెండు సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.






Leave a Reply