సిద్దిపేటలోనే అండర్ గ్రౌండ్ డ్రేనేజీ ఎలా వచ్చింది
తెలంగాణా జాగృతి కవిత

(హైదరాబాద్,న్యూస్ఇన్)
ఓవైసీ బ్రదర్స్ రాజకీయాల్లో పొద్దు తిరుగుడు పువ్వులా ఉంటారని ఎవరు అధికారంలో ఉన్నా…వారి చుట్టూ ఉంటారని తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. మైనార్టీల కోసం ఆ పార్టీ నేతలు ఎలాంటి పనులు చేస్తున్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మైనార్టీల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రకటించిన బడ్జెట్ వెచ్చించ లేకపోయారని, కాంగ్రెస్ పరిస్థితి కూడా అదే విధంగా ఉందన్నారు. మైనార్టీల హక్కుల కోసం పోరాడుతామని చెప్పుకునే ఓవైసీ బ్రదర్స్ ముందుగా తెలంగాణాకు వ్యతిరేకించారని, రాయల తెలంగాణా డిమాండ్ చేశారన్నారు. తెలంగాణా వచ్చిన తరువాత కేసిఆర్ అధికారంలోకి రావడంతో కేసిఆర్ పక్కన చేరారన్నారు. 2023 ఎన్నికలకు ముందు వరకు ఓవైసీ బ్రదర్స్ రేవంత్ రెడ్డిని ఆర్ ఎస్ ఎస్ అంటూ ఆరోపణలు చేసి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో అక్కడకు చేరుకున్నారని చెప్పారు. ఎంఐఎం నేతలు అధికారంలో ఉన్న వారి దగ్గరవ్వడం కొత్త కాదన్నారు. రాహూల్ గాంధీని విమర్శించే ఎంఐఎం సోదరులు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కనీసం అభ్యర్థిని కూడా రంగంలోకి దించకుండా కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చారన్నారు.

ముఖ్యమంత్రులు మీ మాట వినేలా ఉంటే రంజాన్ సందర్భంగా ఇమాం, మౌజం లకు పెంచిన జీతాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. రంజాన్ తోఫాను సీఎం ను ఒప్పించి ఇప్పించాలన్నారు. పాతబస్తీలో రాజకీయం చేసే వీళ్లు పాతబస్తీని ఎంత అభివృద్ధి చేశారో చేపాలన్నారు. ముఖ్యమంత్రులతో సన్నిహితంగా ఉండే ఆ నేతలు చేసిన అభివృద్ది ఏమిటని నిలదీశారు. నగర శివారు మున్సిపాల్టీలకు వెళ్లి మళ్లీ ఎంఐఎంను గెలిపించాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు. పాతబస్తీలో రాజకీయాలు చేసే ఓవైసీ బ్రదర్స్ అక్కడ ఉంటే స్థానిక సమస్యలు తెలుస్తాయని వారు మాత్రం మరో చోట ఉంటూ అక్కడ రాజకీయం చేస్తున్నారన్నారు.మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ పార్టీల ప్రచారం బూతుల ప్రచారంగా జరిగిందన్నారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా పోటీలు పడి బూతులు మాట్లాడాయన్నారు. ఈ ప్రచారాన్ని చూస్తే మున్సిపల్ ఎన్నికలు కూడా పార్టీలకుఅతీతంగా జరిగితే బాగుండేవన్నారు. రాష్ట్రంలో రెండేళ్లలో ఏ మున్సిపాల్టీ అభివృద్ధికి నిధులు ప్రభుత్వం కేటాయించిక పోయినా….సిద్దిపేట కు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మంజూరు చేసిందని ఇది హరీష్ రావ్ రేవంత్ రెడ్డికి ఉన్న సంబంధం అని మరోసారి హరీష్ కు కవిత చురకలు అంటించారు.రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ సమావేశాల్లో ఇచ్చిన హాలకు తగిన బడ్జెట్ కేటాయించాలని, ఈ బడ్జెట్ లో కేటాయింపులు చేయకపోతే ఇకహామీలు అమలు చేయడం కాంగ్రెస్ పార్టీకి సాధ్యం కాదని తేల్చి చెప్పారు.







Leave a Reply