NewsInn

News in a Click

కాంగ్రెస్ సర్కార్ అధికార దుర్వినియోగం

  • ఎన్. రాంచందర్ రావు

(హైదరాబాద్,న్యూస్ఇన్)

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పేలా ప్రజలు తీర్పు ఇస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు.
మక్తల్‌లో కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతో తన ఆధ ప్రయత్నంలో భాగంగా బిజెపి కార్యకర్తలపై బెదిరింపులకు,అరాచకాలకు పాల్పడిందన్నారు. మక్తల్‌లో బిజెపి అభ్యర్థి మహదేవప్ప మరణం ఆత్మహత్య కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ హత్యగానే మేం భావిస్తున్నామని చెప్పారు.మంచిర్యాలలో కూడా బిజెపి కార్యకర్తలు, నాయకులను బెదిరింపులతో వేధించడం జరిగింది. ఇండ్లపై దాడులు చేసిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేల డైరెక్షన్లతో పోలీసులు పనిచేయడం అప్రజస్వామిక చర్య అన్నారు.తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తమ రాజకీయ పట్టును కోల్పోతామనే భయంతోనే ఈ అరాచకాలకు పాల్పడిందని విమర్శించారు.పోలింగ్ రోజున కూడా అనేక కేంద్రాల్లో బిజెపి కార్యకర్తలపై దాడులు చేసి, పోలింగ్ సెంటర్ల వద్ద నుంచి వెళ్లగొట్టే ప్రయత్నాలు జరిగాయన్నారు. డబ్బు,అధికార మదంతో గెలవాలని ప్రయత్నించిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్య పాఠం చెప్తారని మేము విశ్వసిస్తున్నాం అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తీరుపై ఎన్నికల సంఘానికి,పోలీసులకు ఫిర్యాదు చేసినా సరైన స్పందన రాలేదన్నారు.

గ్రేటర్ విభజన అశాస్త్రీయం…..

కాంగ్రెస్ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)ను అశాస్త్రీయంగా మూడు భాగాలుగా విభజించిందని రామచందర్ రావు అన్నారు. రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం.. ఒక కార్పొరేషన్‌ను దారుస్సలాం కేంద్రంగా ఉన్న మజ్లిస్ పార్టీకి కట్టబట్టే ప్రయత్నం చేసింది. కోర్ హైదరాబాద్‌ను మజ్లిస్‌కు తాకట్టుపెట్టే విధంగా జీహెచ్ఎంసీని విభజించి, జీహెచ్ఎంసీ (GHMC)తో పాటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC), మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ (MMC)గా విభజించిందని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *