NewsInn

News in a Click

మేం గెలుస్తామ‌ని భార‌త్ కుట్ర‌ ప‌న్నింది ….!

  • ముందే చెప్పిన న‌మీబియా కెప్ట‌న్ ఎరాస్మ‌స్

( స్పోర్ట్స్ డెస్క్ ,న్యూస్ఇన్‌)

భార‌త‌జ‌ట్టుతో జ‌రిగే టీ-20 మ్యాచ్ కు ప్రారంభానికి ముందే న‌మీబియా కెప్ట‌న్ గెర్డార్డ్ ఎరాస్మ‌స్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఓట‌మి ముందుగానే ఊహించి త‌మ‌కు ప్రాక్టీస్ చేసుకునేందుకు స‌రైన సౌక‌ర్యాలు క‌ల్పించ‌లేద‌ని వ్యాఖ్య‌లు చేశారు. నైట్ మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేసేందుకు గ్రౌండ్లో నెట్ కూడా ఏర్పాటు చేయ‌లేదని బీసీసీఐ, ఐసీసీ లు ఏర్పాట్లు చేయ‌క‌పోవ‌డంతో తాము తీవ్రంగా న‌ష్ట పోవాల్సి వ‌స్తుంద‌న్నారు. భార‌త జ‌ట్టు మాత్రం అన్నిసౌక‌ర్యాల‌తో మ్యాచ్ అడేందుకు రెడీ అయింద‌న్నారు. తభార‌త జ‌ట్టు ఓట‌మి భ‌యంతోనే త‌మ‌కు స‌రైన ఏర్పాట్లు చేయ‌లేద‌ని చేసిన వ్యాఖ్య‌లు కామెడీగా మారాయ‌ని ప‌లువురు వ్యాఖ్య‌లు చేస్తున్నారు. తమ జట్టుపై ఇంత కక్ష కట్టడం ఎందుకని నిలదీశారు. తమ చేతిలో ఇండియా ఓడిపోతుందనే భయంతో ఇలా చేశారని ఆరోపణలు చేశారు నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్.

అసలు వాస్తవం ఏంటంటే ?

నమీబియా మేనేజ్మెంట్ రాత్రిపూట ప్రాక్టీస్ కోసం ఫిబ్రవరి 10వ తేదీ రాత్రి లోపు పర్మిషన్ తీసుకోవాలి. కానీ ఆ సమయంలోపు పర్మిషన్ తీసుకోలేదని ఐసీసీ వెల్లడించింది . ఇది నమీబియా తప్పిదం మాత్రమే అని క్లారిటీ ఇచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *