
10వ తరగతి పరీక్షలు రాయనున్న సూర్యవంశీ
(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్)
భారత క్రికెట్ లో ఇటీవలి కాలంలో సంచలనాలు సృష్టిస్తున్న వైభవ్ సూర్య వంశీ సీబీఎస్ ఇ 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్నారు. బుదవారం నుంచి మొదలయ్యే పరీక్షలకు సూర్యవంశీ ఇప్పటికే హాల్ టికెట్ కూడా తీసుకున్నారు. వైభవ్ బీహార్ లోని సమిస్తీపూర్ లో ఉన్న పొద్దార్ ఇంటర్నేషనల్ పాఠశాలలో చదువుకుంటున్నారు. భారత క్రికెట్ లో ఇప్పటికే తన ప్రత్యేకతను చాటు కుంటున్న వైభవ్ కు పాఠశాలలో అందరు విద్యార్థుల మాదిరిగానే ఏర్పాట్లు చేశారు. కొత్తగా ఎలాంటి ఏర్పాట్లు లేవని పాఠశాల ప్రిన్సిపాల్ నీల్ కిషోర్ వెల్లడించారు. ఫిబ్రవి 17వ తేదీ నుంచి మొదలయ్యే పరీక్షలకు వైభవ్ తన పేరును రికార్డుల పరంగా ( VAIBHAV SOORYAVANSHI) గా నమోదు చేసుకున్నారు వైభవ్ తరపున హాల్ టికెట్ ఆయన తండ్రి తీసుకున్నారని పాఠశాల ప్రిన్సిపల్ చెప్పారు. తమ పాఠశాలలో ఆయనకు ప్రత్యేకంగా ఏమి ఏర్పాట్లు చేయలేదని విద్యార్థుల మాదిరిగానే వైభవ్ ను చూస్తామని ప్రిన్పిపల్ అన్నారు.






Leave a Reply