NewsInn

News in a Click

భార‌త్ జ‌ట్టుతో ఓట‌మి బాధ లేదు…కానీ..!

(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్‌)

ఐసీసీ టీ-20 ప్ర‌పంచ క‌ప్ లో పాకిస్తాన్ జ‌ట్టుకు ఇంట విమ‌ర్శ‌లు, బ‌య‌ట అవ‌మానాలు వేధిస్తూనే ఉన్నాయి. జ‌ట్టు ప్ర‌పంచక‌ప్ ఆడేందుకు శ్రీలంకు చేరుకుని అక్క‌డ ప‌లు మ్యాచ్ ల‌ను ఆడుతోంది. ఇటీవ‌ల భార‌త్ తో జ‌రిగిన జ‌రిగిన మ్యాచ్ తో తీవ్ర విమ‌ర్శ‌ల‌ను ఆ జ‌ట్టు మాజీ పాకిస్తాన్ క్రికెట‌ర్ల నుంచి ఎదుర్కుంది. ప‌లువురు మాజీలు చేసిన ఆరోప‌ణ‌ల‌కు జ‌ట్టు క్రీడాకారులు కూడా ఘాటుగా స్పందించి స‌మాధానం ఇచ్చారు. ఇది పూర్తిగా విస్మ‌రించ‌క‌ముందే… ఆ జ‌ట్టుకు ఎద‌రైన చిక్కుల‌తో ఉస్మాన్ తారీఖ్ తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. తాము శ్రీలంక‌లో ఎక్క‌డికి వెళ్లినా త‌మ బ్యాగేజీని ఒక‌టికి రెండు పార్లు పోలీసులు త‌నిఖీ చేస్తున్నార‌ని, భార‌త జ‌ట్టు బ్యాగేజీని అస‌లు త‌నిఖీలే చేయ‌లేద‌ని తారీఖ్ ఆరోప‌ణ‌.

దీంతో పాటు భార‌త్ తో ఓట‌మి గురించి పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని,శ్రీలంక‌లో త‌మ‌కు ఈ ప‌రిస్థితులు ఎదుర్కోవ‌డం ఇబ్బంది క‌రంగా మారింద‌న్నారు. పోలీసులకు ఇంత ప‌క్ష‌పాతం ఎందుక‌ని తారీఖ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చ‌ర్చ‌కు దారి తీస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *