
(హైదరాబాద్,న్యూస్ఇన్)
మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత కు మళ్లీ లిక్కర్ కష్టాలు మొదలయ్యాయి. లిక్కర్ స్కాంలో గతంలో కవితను సీబీఐ అరెస్టు చేయడంతో దాదాపు ఆరు నెలల పాటు జైలు జీవితం గడపాల్సి వచ్చింది. జైలు వచ్చి వెళ్లిన ఆమె రాజకీయంగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధం అయింది. బీఆర్ ఎస్ పార్టీలో వచ్చిన విబేధాలతో ఆమెను పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీ కీలక నేతలైన హరీష్, కేటిఆర్ లను కవిత రాజకీయంగా టార్గెట్ చేస్తున్నా…బీఆర్ ఎస్ నేతలు తమ అధినేత కూతురు కావడంతో పొలిటికల్ గా ఆచితూచి గులాబీ నేతలు స్పందిస్తున్నారు. కానీ కవిత ఇక ముఖ్యమంత్రి పీఠాన్ని టార్గెట్ చేసుకుని తెలంగాణాలో రాజకీయంగా అడుగులు వేయడం మొదలు పెట్టారు. తెలంగాణా ఉద్యమం లో తెలంగాణా జాగృతి సంస్థను మొదలు పెట్టిన ఆమె ఆ సంస్థ వేదికపైనా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గత మూడు, నాలుగు నెలల నుంచి కవిత బీఆర్ ఎస్ విధానాలను తప్పు బట్టడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ హాట్ గా మారింది. ఇప్పుడు బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నా…..ప్రభుత్వాన్ని కూడా టార్గెట్ చేయడం మొదలు పెట్టారు. త్వరలో పార్టీని ప్రకటన చేసి ముఖ్యమంత్రిని అవుతా అంటూ కవిత బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు.
సీబీఐ నోటీసులు….
ఈ నేపథ్యంలో లిక్కర్ స్కాం కేసు విచారిస్తున్నా ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఆమెకు పెద్ద రిలీఫ్ ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఢిల్లీ ప్రభుత్వ కీలక నేతలు కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కవిత లతో పాటు మొత్తం 23 మందికి డిశ్చార్జ్ చేస్తున్నట్లు ప్రకటింది. దీంతో ఆటు ఆప్ నేతలు, ఇటు కవిత తమకు లిక్కర్ కేసులో క్లీన్ చీట్ వచ్చిందని, బీజేపీ కుట్రతోనే ఈ కేసు నమోదు చేశారని విమర్శలు చేయడం మొదలు పెట్టారు. రౌస్ అవెన్యూ కోర్టు నిర్ణయంపై సీబీఐ ఈ కేసును విచారించాలని హైకోర్టును ఆశ్రయించింది. దీంతో కేసు మళ్లీ మొదటికి వచ్చినట్లయింది.

లీగల్ టీంతో చర్చిస్తున్నా……..
సీబీఐ కోర్టుకు వెళ్లడంతో పాటు మాజీ ఎంపీ కవితకు మరోసారి తాజాగా నోటీసులు జారీ చేసింది. గతంలో నోటీసులు జారీ చేసిన సమయంలో, అధికారులు విచారించిన సమయంలో బీఆర్ఎస్ లీగల్ సెల్ కవితకు అండగా ఉంది. ఆమె జైలులో ఉన్న సమయంలో కూడా పార్టీ కీలక నేతలు హైదరాబాద్- ఢిల్లీ అంటూ తరచూ పర్యటనలు చేస్తూ కవితకు బేయిల్ వచ్చే వరకు ఆ తతంగాన్ని నడిపించారు. పార్టీ అధినేత కేసిఆర్ స్వయంగా ఇది రాజకీయ కుట్రతో నమోదు చేసిన కేసు అని కూడా వ్యాఖ్యానించారు. అయితే తాజాగా మరోసారి కవితకు నోటీసు అందడంతో ఇప్పుడు ఆమె సొంతంగానే ఈ కేసు పై తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సీబీఐ అధికారులు ఢిల్లీ నుంచి వచ్చి కవిత కు నోటీసులు అందించారు. నోటీసులు అందుకున్న ఆమె న్యాయ నిపుణులతో సంప్రదించి తదుపరి కార్యాచరణకు సిద్ధం అవుతానని ఎక్స్ ద్వారా వెల్లడించారు. సీబీఐ నోటీసులు మరోసారి అందడంతో కేసు ఎటు వైపు దారి తీస్తుందో అన్న ఆందోళన జాగృతి కార్యకర్తల్లో మొదలైంది.






Leave a Reply