- కేటిఆర్
(హైదరాబాద్,న్యూస్ఇన్)
ఇటీవల బీఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్య పైలెట్ రోహిత్ రెడ్డి పాం హౌస్ లో పార్టీ చేసుకుని పట్టుబడడం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ హాట్ గా మారింది. ఏపీలో అధికార పక్షానికి చెందిన ఎంపీ పుట్టా మహేష్, తెలంగాణా విపక్ష పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలతో పాటు మరికొంత మంది పట్టుబడ్డారు. అయితే ప్రజాప్రతినిధులుగా ఉన్న ఈ నేతలు పట్టుబడడంతో ఆయా పార్టీకి డ్రగ్స్ పార్టీ కొత్త చిక్కులు సృష్టించింది. ఏపీలో తెలుగుదేశం పార్టీని వైసీపీ టార్గెట్ చేస్తుండగా, తెలంగాణాలో బీఆర్ ఎస్ ను కాంగ్రెస్ నేతలు టార్గెట్ చేస్తున్నారు.

ఈ కేసు అనంతరం కాంగ్రెస్ నేతలు బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ను టార్గెట్ చేయడంతో కేటిఆర్ ఘాటుగా స్పందించారు. తనకు డ్రగ్స్ కేసు అంటగడితే న్యాయపరంగా వెళుతామని హెచ్చరించారు. ఇక అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు అసెంబ్లీలో డ్రగ్స్ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమా అంటూ సవాల్ చేశారు.దీనికి బీఆర్ ఎస్ కూడా రెడీ అంటూనే మెలిక పెట్టింది. సభ్యులందరికీ డ్రగ్స్ పరీక్షలు చేయాలని ప్రతసవాల్ విసిరింది. దీంతో అసెంబ్లీ సమావేశాలకు డ్రగ్స్ సెగ తగిలినట్లయింది. అంశంపై కేటిఆర్ మరోసారి ఈ రోజు మీడియాతో ఇష్టా గోష్టిగా మాట్లాడారు. డ్రగ్స్ పరీక్షలు నిర్వహించాలని తాము డిమాండ్ చేసినా కాంగ్రెస్ కు దమ్ము లేదు. ఇప్పటివరకు సమాధానం లేదన్నారు.

మూసీ ప్రాజెక్టు రియల్ దోపీడికే…..
మూసీ ప్రాజెక్టు ప్రభుత్వం దోపిడి కోసమే తెరపైకి తెస్తుందని కేటిఆర్ఆరోపించారు. ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వం రోజుకో మాట మాట్లాడుతుందన్నారు. ఆరు గ్యారంటీలకు డబ్బులు లేవు, కానీ మూసి కి లక్షన్నర కోట్లు ఎలా తెస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు పొంగులేటి, వివేక్, గుత్తా సుఖేందర్ రెడ్డి ఇల్లు మొత్తం బఫర్ జోన్ లో ఉన్నాయని ఆరోపించారు. మా పార్టీ బీ ఫాం ఈద గెలిచిన వ్యక్తులకు క్లీన్ చీట్ ఇచ్చారు. తిడితే కూడా ఖండిండచడం లేదు…..మేము మాట్లాడితే ఈ ప్రభుత్వం తట్టుకోవడం లేదని కేసీఆర్ ఎందుకు అని కేటిఆర్ ప్రశ్నించారు. పొంగులేటి కొడుకు భూ కబ్జాలు చేస్తే పోలీసు అధికారిని అక్కడి నుంచి బదిలీ చేశారన్నారు.
డ్రగ్స్ ‘పార్టీ ‘లకు చిక్కులే….







Leave a Reply