NewsInn

News in a Click

పొంగులేటీని బ‌ర్త‌ర‌ఫ్ చేయాలి-బీఆర్ ఎస్ నిర‌స‌న‌

పొంగులేటీని బ‌ర్త‌ర‌ఫ్ చేయాలి-బీఆర్ ఎస్ నిర‌స‌న‌

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

మంత్రి ప‌ద‌విని అడ్డుపెట్టుకుని అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని బీఆర్ ఎస్ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించింది. గ‌న్ పార్క్ స‌మీపంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిర‌స‌న తెలిపారు. అనంత‌రం ప్ల‌కార్డుల‌తో అసెంబ్లీకి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్బంగా పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ తాము లేవ‌నెత్తిన అంశాలు స‌రైన‌వే అని సీఎం రేవంత్ రెడ్డి అంగీక‌రించార‌ని చెప్పారు. మంత్రి కుటుంబం చేస్తున్న కుంభ‌కోణాలు బీఆర్ ఎస్ బ‌య‌ట పెట్టే వ‌ర‌కు ప్ర‌భుత్వం మొద్దు నిద్ర‌లో ఉంద‌న్నారు. రాఘ‌వ క‌న్స‌స్ట్ర‌క్ష‌న్స్ పొంగులేటి బంధువుల‌ద‌ని చెప్పార‌ని చెప్పిన విష‌యాన్ని గుర్తు చేశారు. కోడంగ‌ల్ ఎత్తిపోత‌ల ప‌థ‌కాన్ని కూడా పొంగులేటి కంపెనీకే ప‌నులు అప్ప‌గించార‌ని కేటిఆర్ ఆరోపించారు. త‌మ ఆరోప‌ణ‌లు నిజం అని తేలినా సీఎం ఆ మంత్రిపై ఎందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డం ల‌దేని ప్ర‌శ్నించారు. ముఖ్య‌మంత్రి బంధువ‌ల మైనింగ్ కంపెనీ భాగ్య‌ల‌క్ష్మి మైనింగ్ కోకాపేట‌లో ఉంద‌న్నారు. మైనింగ్ కార‌ణంగానే రాష్ట్రానికి 1800 కోట్ల ఆదాయం రావాల్సి ఉండ‌గా కేవ‌లం 900 కోట్ల రుపాయాలు వ‌స్తుంద‌న్నారు. మెట్రో పై ప్ర‌భుత్వం తెచ్చిన తీర్మానం కూడా త‌ప్పుల త‌డ‌క అన్నారు. ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోక‌పోతే ఈ వ్య‌వ‌హారంపై గ‌వ‌ర్న‌ర్ కు ఫిర్యాదు చేస్తామ‌న్నారు.

బీఆర్ ఎస్ నిర‌స‌న‌……

|శాస‌నస‌భ స‌మావేశాలు ప్రారంభ‌మైన త‌రువాత కూడా బీఆర్ ఎస్ త‌మ నిర‌స‌న‌ను కొన‌సాగింది. పొంగులేటిని మంత్రి ప‌ద‌వి నుంచి బ‌ర్త‌రఫ్ చేయాల‌ని డిమాండ్ చేసింది. అసెంబ్లీ లో పొంగులేటికి వ్య‌తిరేకంగా నినాదాలు చేసింది. శాస‌న‌స‌భ‌లో నినాదాలు చేస్తుండ‌డంతో మంత్రి శ్రీధ‌ర్ బాబు స్పందించారు. ముఖ్య‌మంత్రి సీబీసిఐడి విచార‌ణ‌కు ఆదేశించినా…క్యాబినెట్ స‌బ్ క‌మిటీ వేయాల‌ని డిమాండ్ చేయ‌డం భావ్యం కాద‌న్నారు. బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు నిర‌స‌న తెలిపేందుకు వెల్ లోకి వెళ్లేందుకు ప్ర‌య‌త్నిస్తే…మార్షల్స్ ఎమ్మెల్యేల‌ను అడ్డుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *