NewsInn

News in a Click

పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తి

విజన్ తోనే అభివృద్ధి

కోకాపేట భూముల ధరలే దీనికి ఉదాహరణ

ముఖ్యమంత్రి చంద్రబాబు

                        (అమ‌రావ‌తి, న్యూస్ఇన్)

గోదావ‌రి పుష్క‌రాల‌కు ముందుగానే పోల‌వరం ప్రాజెక్టు పూర్తి చేస్తామ‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప్ర‌క‌టించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 18 నెలల్లో పెన్షన్ల పంపిణీ కోసమే రూ.50,763 కోట్లు ఖర్చు చేశామని, దేశంలో ఎక్కడా ఈ స్థాయిలో సంక్షేమం కోసం వ్యయం చేస్తున్న రాష్ట్రం మరొకటి లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్ఫష్టం చేశారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం గోపీనాథపట్నంలో పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తురాలు నాగలక్ష్మి ఇంటికి వెళ్లి పింఛను అందజేశారు. హైదరాబాద్ లో తాను ముందు చూపుతో చేసిన అభివృద్ధి ఫలాలు ఇప్పుడు క‌నిపిస్తున్నాయ‌న్నారు.

ఒకప్పుడు కోకాపేటలో ఎకరా రూ.10 వేలు ఉంటే నేడు రూ.160 కోట్ల వరకూ వెళ్లింది. అభివృద్ది జరిగితే భూముల ధరలు పెరుగుతాయి. కియా కార్ల పరిశ్రమ రాకతో అనంతపురం పెనుగొండ ప్రాంతంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అక్కడ ఎకరం రూ.10 లక్షలు ఉండే భూమి ఇప్పుడు కోట్లలో పలుకుతోందన్నారు. అమరావతి పనులు వేగంగా జరుగుతున్నాయి. 2028 నాటికి అమరావతి ఫేజ్ 1 పనులు పూర్తవుతాయి. ప్రపంచంలోనే సుందర నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతాం. తిరుపతిని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.

అన్నదాత అభివృద్ధికి పంచ సూత్రాలు

వ్యవసాయం చేసే రైతు నష్టపోకుండా ఉండేందుకు పంచ సూత్రాలు అమలు చేస్తున్నాం. వాటర్ సెక్యూరిటీ, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వాల మద్దతు ద్వారా సాగును లాభసాటి చేసేందుకు ప్రణాళిక అమలు చేస్తున్నాం. ఇటీవల విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సులో రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇప్పటికే రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపాం. 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం.

విశాఖ నగరానికి గూగుల్ డేటా సెంటర్ వచ్చిందంటే అందుకు ప్రభుత్వంపై ఉన్న విశ్వసనీయతే కారణం. దేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చాక రూ.1.40 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం మొదటిసారి. ప్రతి నియోజకవర్గంలో మూడు నెలలకు ఓసారి జాబ్ మేళాలు నిర్వహిస్తాం. 2027 నాటికి గోదావరి పుష్కరాలకంటే ముందే పోలవరం పూర్తిచేసి జాతికి అంకితం చేస్తాం. పోలవరం పూర్తయితే నీటి ఎద్దడి ఉండదు. పొలాలకు రేట్లు పెరుగుతాయి.2028 నాటికి అమరావతి ఫేజ్ 1 పనులు పూర్తవుతాయి. ప్రపంచంలోనే సుందర నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతాం. తిరుపతిని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. గత పాలకులకు దోచుకోవడం, దాచుకోవడమే తెలుసు. అభివృద్ధి అంటే వారికి నచ్చదు. గతంలో నేను ముఖ్యమంత్రిగాచేసిన అభివృద్ధిని తర్వాత వచ్చినవాళ్లు అడ్డుకోలేదు. గత పాలకులు మాత్రం రాష్ట్రాన్ని గంజాయికి కేరాఫ్ అడ్రస్ గా మార్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *