NewsInn

News in a Click

ఎపీలో ఎస్సీ, ఎస్టీల‌కు ఉచితం

ప్ర‌టించిన ప్ర‌భుత్వం

(అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌)

కేంద్ర ప్రభుత్వం సూర్యఘర్ యెజన పథ‌కంలో సౌర విద్యుత్ ఏర్పాటు చేసుకోవాలంటే కేంద్రం భారీగా రాయితీ ఇస్తోంది. అంతేకాకుండా బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తుంది. మీ ఇంటికి అవసరయ్యే విద్యుత్‌ను మీరే ఉత్పత్తి చేసుకోవచ్చు. అయితే ఈ పథకం అమలుకు ఏపీ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. దళితులు,గిరిజనులు, వెనుకబడిన వర్గాల ప్రజలకు ఈ పథకాన్ని ఉచితంగా అమలు చేస్తామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రక‌టించారు.

ఎస్సీ, ఎస్టీలకు ఉచితం

ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా సౌర విద్యుత్ ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించనుండగా.. బీసీలకు పెద్ద మొత్తంలో రాయితీ కల్పించనున్నారు. ఇందుకోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అలాగే సచివాలయాన్ని సందర్శించి కూడా దరఖాస్తు పెట్టుకోవచ్చని సూచించారు. కేంద్ర ప్రవేశపెట్టిన ఈ పధకం ద్వారా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందవచ్చని తెలిపారు. దేశవ్యాప్తంగా కోటిమందికి ఈ పథకం వర్తింపచేయాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలిపారు.

రాయితీ పొంద‌డం ఎలా..?

ఈ పధకం ద్వారా మీ ఇంటిపై సౌర విద్యుత్ ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటే కేంద్ర ప్రభుత్వం రాయితీ అందిస్తుంది. ఉదాహరణకు మీరు 3 కిలోవాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాలంటే రూ.1.50 లక్షలు ఖర్చు అవుతుందని అనుకుంటే.. అందులో రాయితీ ద్వారా మీకు రూ.70 వేలు అందుతాయి. ఇక మిగతా సొమ్ము మీరు పెట్టుకుని ఏర్పాటు చేసుకోవాలి. pmsuryaghar.gov.in వెబ్ సైట్‌లోకి వెళ్లి అప్లికేషన్ పెట్టుకుంటే అధికారులు మీకు అనుమతి మంజూరు చేస్తారు. ఆ తర్వాత కొత్త మీటర్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. దీని ద్వారా మీరు ఉచితంగా కరెంట్ సౌకర్యం పొందవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *