NewsInn

News in a Click

తెలంగాణా ఇంట‌ర్ ఫ‌లితాల్లో బాలిక‌ల‌దే పైచేయి

తెలంగాణా ఇంట‌ర్ ఫ‌లితాల్లో బాలిక‌ల‌దే పైచేయి

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

తెలంగాణా ఇంట‌ర్మీడియ‌ట్ ప‌లితాల‌ను ఇంట‌ర్ బోర్డు విడుద‌ల చేసింది. ప్ర‌భుత్వ స‌ల‌హాదారు కే.కేశ‌వ‌రావ్ ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో పెట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ వార్షిక వార్షిక పరీక్షలు జరిగాయి. సుమారు 9.9 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 4,89,126 మంది ఇంటర్ ఫస్టియర్, 5,07,949 మంది ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉన్నారు

2026 ఫలితాల్లో సెకండియర్‌లో మొత్తం 4,11,474 మంది విద్యార్థులు హాజరుకాగా, 3,11,112 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలికల ఉత్తీర్ణత శాతం 81.78 కాగా, బాలురు 68.99 శాతంతో సరిపెట్టుకున్నారు. దాదాపు 12 శాతం వ్యత్యాసంతో బాలికలు ముందంజలో ఉన్నారు. ఇక ఫస్ట్ ఇయర్ విషయానికి వస్తే 4,41,864 మందికి గాను 2,95,780 మంది పాస్ అయ్యారు.

వార్షిక ప‌రీక్ష‌ల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు బోర్డు నుంచి అప్డేట్ వచ్చేసింది.ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను మే 13వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు బోర్డు ప్రకటించింది. మే 22వ తేదీ నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్(సప్లిమెంటరీ) పరీక్షలు జరుగుతాయని, ఈ పరీక్షల ఫీజు చెల్లింపు ప్రక్రియ ఏప్రిల్ 13వ తేదీ నుంచి 20వ తేదీ వరకు విద్యార్థులు ఫీజులు చెల్లించుకోవచ్చు.

2026 ఇంట‌ర్ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా 82.73 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో జయశంకర్ భూపాలపల్లి (82.34%), కొమురం భీమ్ ఆసిఫాబాద్ (82.16%) నిలిచాయి. ములుగు జిల్లా 82.12 శాతంతో నాలుగో స్థానంలో నిలిచింది.

ఆన్‌లైన్ మెమోలో పేరు, గ్రూపు లేదా మార్కులలో ఏవైనా పొరపాట్లు ఉంటే, ఫలితాలు విడుదలైన 10 రోజులలోపు helpdesk-ie@telangana.gov.in ఫిర్యాదు చేయాలి. ఆ గడువు దాటిన తర్వాత వచ్చే దరఖాస్తులను బోర్డు స్వీకరించదు

గ్రూపుల వారీగా ఉత్తీర్ణత శాతం….

సెకండియర్‌లో గ్రూపుల వారీగా చూస్తే:

MPC: 78.01 శాతం ఉత్తీర్ణతతో అగ్రస్థానంలో నిలిచింది.
BPC: 76.04 శాతంతో తర్వాతి స్థానంలో ఉంది.
MEC: 67.91 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
CEC: 49.39 శాతానికి పరిమితమైంది.
HEC: 49.25 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో ఎంపీసీ (75.51 శాతం),
బైపీసీ (72.39 శాతం) విద్యార్థులు రాణించగా,
హెచ్ఈసీ విద్యార్థులు కేవలం 34.34 శాతంతో వెనుకబడ్డారు.

మేడ్చల్ జిల్లా 82.73 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో జయశంకర్ భూపాలపల్లి (82.34%), కొమురం భీమ్ ఆసిఫాబాద్ (82.16 శాతం) నిలిచాయి. ములుగు జిల్లా 82.12 శాతంతో నాలుగో స్థానంలో నిలిచి స‌త్తా చాటింది.

అట్టడుగున ఉన్న జిల్లాలను గమనిస్తే

రాజన్న సిరిసిల్ల: 58.69 శాతం
వరంగల్: 60.80 శాతం
ఆదిలాబాద్: 62.50 శాతం జిల్లాలు త‌క్కువ శాతం ఫ‌లితాలు సాదించాయి.

ఇంట‌ర్ ఫ‌లితాల కోసం……

రీ-వెరిఫికేషన్, రీ-కౌంటింగ్…..

తమ మార్కులతో సంతృప్తి చెందని విద్యార్థుల కోసం బోర్డు రెండు రకాల అవకాశాలను కల్పించింది. దీని కోసం ఏప్రిల్ 13 నుండి ఏప్రిల్ 20 వరకు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించవచ్చు.

రీ-కౌంటింగ్….. ఒక్కో పేపరుకు రూ.100 చెల్లించాలి. ఇందులో కేవలం మార్కుల లెక్కింపును మాత్రమే మరోసారి సరిచూస్తారు.

రీ-వెరిఫికేషన్……. ఒక్కో పేపరుకు రూ.800 చెల్లించాలి. ఇందులో విద్యార్థికి తన సమాధాన పత్రం స్కాన్డ్ కాపీని అందజేస్తారు, అలాగే మార్కుల లెక్కింపును కూడా తనిఖీ చేస్తారు.

అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ…..

ఇంట‌ర్ వార్షిక ప‌రీక్ష‌ల్లో ఫేయిల్ అయిన విద్యార్థుల విద్యా సంవ‌త్స‌రం న‌ష్ట‌పోకుండా చూసేందుకు మే 13, 2026 నుండి మే 22, 2026 వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇవి రెండు సెషన్లలో జరుగుతాయి. దీనికి సంబంధించిన పరీక్ష ఫీజును కూడా ఏప్రిల్ 13 నుండి 20 మధ్యలో చెల్లించాలి

2026 ఫలితాలను పరిశీలిస్తే, ఈ ఏడాది సెకండియర్‌లో అత్యధికంగా 75.61 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 2022లో ఇది 68.68 శాతంగా ఉండగా, క్రమంగా పెరుగుతుండ‌డం విద్యా ప్ర‌మాణాలు పెరుగుతున్నాయ‌నేందుకు నిద‌ర్శ‌నంగానిలుస్తోంది. ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో కూడా గత ఏడాది కంటే స్వల్ప వృద్ధిని కనబరిచింది.

దోస్త్ నోటిఫికేష‌న్ రేపు…….

సోమ‌వారం దోస్త్ నోటిఫికేష‌న్ వెలువ‌డ‌నుంద‌ని ఉన్న‌తాధికారులు వెల్ల‌డించారు. ఇంట‌ర్ ప‌రీక్ష‌ల్లో పాస్ అయిన విద్యార్థులు డిగ్రీలో చేరేందుకు ఈ నోటిఫికేష‌న్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించారు. ఇంట‌ర్మీడియ‌ట్ త‌ప్పిన విద్యార్థులకు అడ్వాన్స్డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల త‌రువాత కూడా అవ‌కాశం ఉంటుందని అధికారులు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *