(హైదరాబాద్,న్యూస్ఇన్)
కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లుకు ఆమోదం తెలిపేందుకు సిద్దం అవుతుందని ఈబిల్లుతో చిన్న రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగనుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర కుట్రలో దక్షిణాది రాష్ట్రాలతో పాటు చిన్న రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయన్నారు. మహిళా బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులు ఒకే సారి పెడుతుండడం కేంద్రం చేస్తున్న కుట్రగా చెప్పారు. మహిళా బిల్లుకు తాము పూర్తిగా మద్దతు ఇస్తామని, ఇప్పటికప్పుడే రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని సీఎం వ్యక్తం చేశారు. గతంలో బీజేపీ సహకరించకపోవడంతోనే ఆగిపోయిందని, ఇప్పుడు తాము బీజేపీలా వ్యవహరించమని తేల్చి చెప్పారు.

ఇక పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రం ఆదరాబాదరాగా బిల్లు ఆమోదించి చిన్న రాష్ట్రాలకు అన్యాయం చేస్తోందన్నారు.కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో ఉత్తరాది రాష్ట్రాలు రాజకీయంగా మరింత శక్తి వంతంగా మారుతాయని, దక్షిణాది రాష్ట్రాలతో పాటు చిన్న రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. ఈ బిల్లుపై అఖిల పక్ష సమావేశం నిర్వహించి పెద్ద ఎత్తున చర్చ జరుగాల్సి ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆ తరువాత ఈ పునర్విభజన బిల్లు ఆమోదించాలని డిమాండ్ చేశారు. దక్షిణాది రాష్ట్రాలతో పాటు చిన్న రాష్ట్రాలకు రాజకీయంగా జాతీయ రాజకీయాల్లో పూర్తిగా ప్రాధాన్యత తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో నియోజకవర్గాల పునర్విభవజనపై చెన్నైలో ఒక సమావేశం జరిగిందని, దీనికి కొనసాగింపుగా మరిన్ని రాష్ట్రాల్లో తాము కలిసి వచ్చే రాజకీయ పార్టీలను ఏకం చేస్తామన్నారు.
కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజనను హైబ్రీడ్ పద్దతిలో చేయాలన్నారు. దక్షిణాది రాష్ట్రాలు కేంద్రం సూచనలు పాటించినందుకు తాజాగా కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలతో నష్ట పోవాల్సిన పరిస్థితి వస్తుందని ఆరోపించారు. పునర్విభజనపై పెద్ద ఎత్తున చర్చ జరిగి అందరికీ న్యాయం జరిగేలా పునర్విభజన చేయాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి అన్నారు.
బీజేపీలో మహిళలకు ప్రాధాన్యత లేదు…..
బీజేపీ ఆవిర్భావం నుంచి మహిళకు పెద్దగా ప్రాధాన్యత కల్పించలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బండి సంజయ్, కిషన్ రెడ్డిలు తాము మహిళా బిల్లుకు వ్యతిరేకం అని ప్రచారం చేయడం తగదన్నారు. కాంగ్రెస్ పార్టీ మహిళాలకు కీలక స్థానాల్లో అవకాశం కల్పించిన విషయాన్ని ఆ నేతలు గుర్తుంచుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ, సోనియా గాంధీ నాయకత్వలో ఎంతో మహిళలకు కీలక బాధ్యతలు అప్పగించిన విషయాన్ని గుర్తు చేశారు.
అన్యాయం జరుగదు…. కిషన్ రెడ్డి

నియోజకవర్గాల పునర్విభజనపై కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని కిషన్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రానికి అన్యాయం చేయదని చెప్పారు.తాజాగా చేపడుతున్న సెన్సెస్ ప్రచారం మహిళా రిజర్వేషన్లు, పునర్విభజన చేసి అమలు చేసేందుకు సమయం చాలదని ఈ కారణంగానే 2011 జనాభా లెక్కల ప్రకారమే ఇప్పుడు ఈ బిల్లులు తెస్తున్నామని చెప్పారు. 2027 జనగణన అనంతరం వచ్చే ఐదేళ్లలో కావాల్సిన మార్పులు చేసేలా బిల్లు ఉంటుందన్నారు. కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కిషన్ రెడ్డి అన్నారు.











Leave a Reply