(హైదరాబాద్,న్యూస్ఇన్)
అంగన్ వాడి మొబైల్ ఫోన్ల కొనుగోలు విషయంలో నిరాధార ఆరోపణలు చేస్తూ తన ప్రతిష్టకు భంగం వాటిల్లేలా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు అంటూ కేసిఆర్ కు మంత్రి సీతక్క లీగల్ నోటీసు పంపారు.సీతక్క తరుపున న్యాయ వాది నాగులూరి కృష్ణ కుమార్ ఈ నోటీసులు పంపారు. అంగన్ వాడి మొబైల్ ఫోన్ల కొనుగోలు ప్రక్రియను తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ నిర్వహించిందని, టెండర్ ఇవాల్యుయేషన్ కమిటీ నిర్ణయాల ప్రకారం కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగిందన్నారు.

ఇందులో తనకు ఎలాంటి సంబంధం లేదని నోటీసులో సీతక్క స్పష్టం చేశారు. మొత్తం టెండర్ విలువ రూ. 44 కోట్లే ఉన్నప్పటికీ, అందులో రూ. 30 కోట్ల అవినీతి జరిగిందని చెప్పడం, ఆధారాలు లేని ఆరోపణగా నోటీసుల్లో పేర్కొన్నారు. బీఆర్ ఎస్ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారానికి కెసిఆర్ బాధ్యత వహించాలన్నారు. రెండు రోజుల్లో తనపై పెట్టిన పోస్టుల ను బీఆర్ ఎస్ పార్టీ తొలగించకపోతే సీవిల్ క్రిమినలర్ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.











Leave a Reply