NewsInn

News in a Click

LSG Vs PBKS: గెలిపించి టోర్నిలో నిలిపిన అయ్యర్

LSG Vs PBKS:  గెలిపించి టోర్నిలో నిలిపిన అయ్యర్


(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్‌)

ఐపీఎల్ సీజ‌న్ ప్రారంభం అయిన నాటి నుంచి వ‌రుస విజ‌యాల‌తో దూసుకొచ్చిన పంజాబ్ స‌గం మ్యాచ్ ల త‌రువాత చ‌ల్ల‌బ‌డింది. ఇక ప్ర‌తి మ్యాచ్ లో గెలుపు కోసం చేసిన ప్ర‌య‌త్నాలు స‌ఫ‌లం కాలేదు…వ‌రుస విజ‌యాల‌తో పాటు వరుస అప‌జ‌యాల‌ను పంజాబ్ మూట‌గ‌ట్టుకుంది. ఈ ప‌రిస్థితుల్లో ల‌క్నో తో జ‌రిగిన మ్యాచ్ లో ఖ‌చితంగా విజ‌యం సాధిస్తేనే త‌దుప‌రి టౌర్నిలో త‌దుప‌రి ద‌శ‌కు వెళ్లే మ్యాచ్ లో పంజాబ్ విజ‌యం ద‌క్కించుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ల‌క్నో సూప‌ర్ జెంట్స్ 20 ఓవ‌ర్ల‌లో 196 ప‌రుగులు చేసింది. 197 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యంతో బ‌రిలో దిగిన పంజాబ్ తొలి బంతి కే క‌ష్టాల్లో ప‌డింది. టీం ఇండియా వెట‌ర‌న్ ష‌మీ బౌలింగ్ లో తొలి వికెట్ రూపంలో ఫాంలో ఉన్న ప్రియాన్ష్ ఆర్య ఔట‌య్యారు. ఆ త‌రువాత మ‌రో బ్యాట్స్ మెన్ కాన్లీ కూడా కేవ‌లం 18 ప‌రుగులు మాత్ర‌మే చేసి వెనుదిరిగారు. మ‌రో ఓపెన‌ర్ ప్ర‌భ్ సిమ్రాన్ సింగ్ క్రీజులో నిల‌దొక్కుకోవ‌డం, కెప్ట‌న్ శ్రేయ‌స్ అయ్యార్ లు మ్యాచ్ లో కీల‌క భాగ‌స్వామ్యం నెల‌కొల్పారు. అయ్యార్ ఈ మ్యాచ్ లో కెప్ట‌న్ ఇన్నింగ్స్ ఆడి జ‌ట్టును విజ‌య తీరాల‌ను చేర్చారు. ల‌క్నో కెప్ట‌న్ పంత్, అయూష్ బ‌దోని లు సులువైన క్యాచ్ లు జార విడ‌వ‌డంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వ‌చ్చింది. ప్ర‌భ్ సిమ్రాన్ సింగ్ 39 బంతులు ఎదుర్కొని 69 ప‌రుగులు చేసి అర్జున్ టెండూల్క‌ర్ బౌలింగ్ లో వెనుదిరిగారు. మ‌రో వైపు క్రీజులో కెప్ట‌న్ అయ్యర్ త‌డ‌బ‌డ‌కుండా పంజాబ్ ను గెలుపించే విధంగా ఇన్నింగ్స్ చ‌క్క దిద్దే ప‌నిలో ప‌డ్డారు.శ్రేయ‌స్ ఈ మ్యాచ్ లో సెంచ‌రీ చేసి జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషించారు.

అంత‌కు ముందు బ్యాటింగ్ చేసిన ల‌క్నో సూప‌ర్ జెంట్స్ 20 ఓవ‌ర్లలో 6 వికెట్లు కోల్పోయి 196 ప‌రుగులు చేసింది. ల‌క్నో త‌డ‌బ‌డుతూ ఇన్నింగ్స్ మొద‌లు పెట్టింది. ఓపెన‌ర్ కుల‌క‌ర్ణి ప‌రుగులేమి చేయ‌కుండానే వెనుదిరిగారు. మ‌రో ఓపెన‌ర్ జోష్ ఇంగ్లీష్ 44 బంతులు మాత్ర‌మే ఎదుర్కొని 72 ప‌రుగులు చేశారు. 9 ఫోర్ల‌, 2 సిక్స్ ల‌తో జోష్ ఇంగ్లీస్ ల‌క్నో జ‌ట్టును భారీ స్కోరు దిశ‌గా న‌డిపించారు. పేల‌వ ఫాంలో ఉన్న నికోల‌స్ పూర‌న్ కేవ‌లం 2 ప‌రుగులు మాత్ర‌మే చేసి ఔట‌య్యారు. అయూష్ బ‌దోని ఇన్నింగ్స్ ల‌క్నో భారీ స్కోరు చేసేందుకు దోహ‌ద‌ప‌డింది. కేవ‌లం 18 బంతులు మాత్ర‌మే ఎదుర్కొని 5 ఫోర్లు, 3 సిక్స్ ల‌తో 43 ప‌రుగులు చేశారు. కెప్ట‌న్ పంత్ 22 బాల్స్ లో 26 ప‌రుగులు చేసి ఔట‌య్యారు. అబ్దుల్ స‌మ‌ద్ 20 బాల్స్ ఎదుర్కొని చివ‌ర్లో 37 ప‌రుగులు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *