(స్పోర్ట్స్ డెస్క్, న్యూస్ఇన్)
ముంబాయి ఇండియాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఆర్ ఆర్ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ తడబడుతూ ఇన్నింగ్స్ ముగించింది. ముంబాయి బ్యాటర్లు 206 పరుగుల విజయ లక్ష్యాన్ని చేరుకోకపోవడం ఆర్ ఆర్ 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో విజయంతో రాజస్థాన్ ప్లే ఆఫ్ లో బెర్త్ ఖరారు చేసుకుంది. 20 ఓవర్లలో 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. పవర్ ప్లేలోని 54 పరుగులు చేసి 3 కీలక వికెట్లు కోల్పోయింది. యశస్వీ జైస్వాల్ 27 పరుగులు చేసి వెనుదిరగగా వైభవ్ సూర్యవంశీ ఈమ్యాచ్ లో కేవలం 4 పరుగులకే పరిమితం అయ్యారు. కెప్టన్ పరాగ్ 14 పరుగుల చేసి ఔటయ్యారు. ధృవ్ జురేల్ 38 పరుగులు చేసి ఆర్ ఆర్ జట్టుకు స్కోరు భారీ చేసేందుకు అవకాశం దక్కంది. జురేల్ కు దాసున్ శనక లు క్రీజులో ఉన్నంత సేపు ఆర్ ఆర్ భారీగా పరుగులు చేస్తుందన్న ధీమా కనిపించింది. శనక 15 బాల్స్ మాత్రమే ఎదుర్కొని 3 సిక్స్ లతో 29 పరుగులు చేసి ఔటయ్యారు. ఫెరీరా 18 పరుగుల చేయగా…6వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన జోఫ్రా ఆర్చర్ 15 బంతుల్లోనే 32 పరుగులు చేసి స్కోరును వేగంగా పెంచి వెనుదిరిగారు. శుభం దుబె 5 పరుగుల చేయగా రవీంద్ర జడేజా 11 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లతో 19 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. బర్గర్ కూడా 3 బంతుల్లోనే 10 పరుగులు చేసి నాటౌట్ గా ఉన్నారు.ముంబాయి బౌలర్లలో దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్ లు తలో రెండు వికెట్లు తీసుకోగా మిగిలిన వారు ఒక్కో వికెట్ తీసుకున్నారు.


206 పరుగుల విజయ లక్ష్యంగా బరిలో దిగిన ముంబాయి పవర్ ప్లే లోనే కష్టాల్లో పడింది. హిట్ హ్యాన్ పరుగుల ఖాతా మొదలు పెట్టకముందే పెవీలియన్ చేరుకున్నారు. ఆ తరువాత బ్యాటింగ్ వచ్చిన నమదన్ ధీర్ కూడా పెద్దగా పరుగులు చేయకుండానే ఔటయ్యారు. ఆ తరువాత ఫాంలో ఉన్న రికెల్టన్ కూడా కేవలం 12 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యరు. దీంతో 6 ఓవర్లలో 38 పరుగులకే ముంబాయి ఇండియాన్స్ 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. సీజన్ ఫాం లేమితో సతమతం అవుతున్న సూర్యకుమార్ యాదవ్ ఈ రోజు మాత్రం రాణించారు. జట్టు గెలుపు బాధ్యతను మోస్తున్నట్లు కనిపించారు. సూర్య- హర్దిక్ పాండ్యాలు భారీగా పరుగులు రాబట్టడంతో ముంబాయి జట్టును విజయం ఊరించింది. ఈ ఇద్దరు బ్యాటర్లు క్రీజులో ఉండడంతో ముంబాయికి విజయం వరిస్తుందన్న ధీమా కనిపించింది. ఆర్చర్ వేసి ఓవర్లో హర్దిక్ ఔట్ కావడంతో ముంబాయి ఆశలపై నీళ్లు పోసినట్లయింది. పాండ్యా15 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు, 2 సిక్స్ లతో 34 పరుగులు చేసి సూర్య ఈ మ్యాచ్ లో ఫాంలోకి వచ్చారు. 42 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్ లతో 60 పరుగులు చేసి 158 పరుగుల వద్ద వెనుదిగడంతో ముంబాయి ఓటమి ఖాయమైంది. జోఫ్రా ఆర్చర్ బ్యాటింగ్ రాణించడంతో పాటు బౌలింగ్ లో 3 వికెట్లు తీసుకోవడంతో… రాజస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించారు.










Leave a Reply