000 ఓట్లు సాధించడంతో నయా రికార్డు
(హైదరాబాద్,న్యూస్ఇన్)
ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఎన్నో విచిత్రాలు చోటు చేసుకున్నాయి….ఒక్కొక్కటి గా వెలుగులోకి వస్తున్నాయి. రాజకీయ పార్టీలతో సంబంధం లేకపోయినా అన్ని రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి.తాము బలపరిచిన అభ్యర్థులు విజయం సాధిస్తే…తమ పార్టీ గెలిచినట్లుగానే భావిస్తాయి…. కొన్ని చోట్ల ఒకటి, రెండు ఓట్లతో విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులు కూడా ఉంటారు. అతి తక్కువ ఓట్ల సాధించిన అభ్యర్థులు ఉంటారు. కానీ పోటీ చేసిన అభ్యర్థికి ఒక్క ఓటు కూడా రాకపోవడం మరింత ఆశ్యర్యానికి గురి చేస్తోంది.

వరంగల్ జిల్లా ఖానాపురం మండలం కీర్యా తండాలో ఈ నెల 17న జరిగిన మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా రాని సర్పంచ్ అభ్యర్థిగా రికార్డు సృష్టించారు ఓ మహిళ.మొత్తం 239 ఓట్లు పోలవగా బోడ గౌతమికి కనీసం ఒక్క ఓటు కూడా పడకపోవడంతో.. ఆమె తనకు తానూ ఓటు వేసుకోలేదా? అని తండా వాసులు ఆశ్చర్య పోతున్నారు. గ్రామంలో పోలైన ఈ ఓట్లలో నోటా కు 1 ఓటు రాగా, మూడు ఓట్లు చెల్లని ఓట్లుగా అధికారులు నిర్ధారించారు. అయితే ఒక్క ఓటు కూడా పడని సర్పంచ్ అభ్యర్థిగా బోడ గౌతమి రికార్డుకెక్కారు. కనీసం పోటీచేసిన అభ్యర్థిగా ఉన్న గౌతమి ఆమె ఓటు ఆమె కూడా వేసుకోలేదా అన్న చర్చ జరుగుతోంది. కుటుంబ సభ్యులు కూడా ఆమెకు మద్దతుగా నిలువ లేదంటే రాజకీయ సమీకరణల కోసం పోటీ చేశారా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ అభ్యర్థికి బీజెపి పార్టీ మద్దతు ఇచ్చిందన్న ప్రచారం కూడా ఉంది.







Leave a Reply