(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్)
రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ లో ఢిల్లీ రాజస్థాన్ పై విజయం సాధించింది. ఐదు వికెట్ల తేడా తో ఢిల్లీ ఆర్ ఆర్ పై విజయం దక్కించుకుంది.ఢిల్లీ ఓపెనర్లు చెలరేగడంతో విజయం సులువుగానే విజయం దక్కేలా కనిపించింది.194 పరుగులు విజయ లక్ష్యంతో బరిలో దిగిన ఢిల్లీకి ఓపెనర్లే శుభారంభం అందించారు. వికెట్ కోల్పోకుండా కేఎల్ రాహూల్- అభిషేక్ పోరెల్ లు 10 ఓవర్లలో 105 పరుగులు సాధించారు. అనంతరం 11వ ఓవర్ తొలి బంతికి అభిషేకర్ పోరేల్ 31 బంతులు ఎదుర్కొని 51 పరుగులు చేసి ఔటయ్యారు. కేఎల్ రాహూల్ ఎంతో బాధ్యతాయుతంగా ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ చేశారు. జట్టును గెలిపించే లక్ష్యంగా ఆచితూచి పరుగులు సాధించడంపై ఫోకస్ పెట్టారు. పోరెల్ ఆర్ ఆర్ బౌలర్లపై విరుచుకు పడుతుండడంతో పోరెల్ కు స్ట్రైక్ ఇచ్చేందుకే రాహూల్ ప్రాధాన్యత నిచ్చారు.12.3 ఓవర్ల దగ్గర ఢిల్లీ 122 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. సాహిల్ పరేఖ్ 9 పరుగులు చేసి ఔటయ్యారు. ఆ తరువాత మరో 10 పరుగులు జోడించిన అనంతరం కేఎల్ రాహూల్ 56 పరుగులు చేసి ఔటయ్యారు. వరుసగా డిల్లీ వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ ఉత్కంఠ గా మారింది.
ఉత్కంఠగా మారినా DC విజయం ….
3 ఓవర్లలో 35 పరుగులు చేయాల్సి ఉండడంతో మ్యాచ్ పై ఉత్కంఠ గా మారింది.18వ ఓవర్లో రెండు సిక్స్ లు కొట్టి మొత్తం 16 పరుగులు సాధించడంతో డిల్లీపై వత్తిడి తగ్గింది. రెండు ఓవర్లలో 19 పరుగులు టార్గెట్ గా మారాయి. బ్రిజేష్ వేసిన 19 వ ఓవర్ తొలి బంతికే మిల్లర్ భారీ షాట్ ఆడబోయి బౌండరీ దగ్గర క్యాచ్ ఇవ్వడంతో మరోసారి మ్యాచ్ ఆసక్తి కరంగా మారింది. మిల్లర్ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన అసుతోష్ శర్మ ఐదో బంతిని సిక్స్ గా మలచడంతో 7 బంతుల్లో 8 పరుగులు మాత్రమే అవసరం అయ్యాయి. చివరి బంతికి ఒక్క పరుగు తీసుకోవడంతో 20 ఓవర్లో ఢిల్లీ విజయం కోసం 7 పరుగులు చేయాల్సి వచ్చింది. తొలి బంతికే 4 కొట్టడంతో విజాయానికి లైన్ క్లియర్ అయింది. ఆ తరువాతి బంతికి సిక్స్ కొట్టడంతో ఢిల్లీకి విజయం దక్కింది. అక్షర్ 18 బంతుల్తో 34 పరుగులు చేయగా అసుతోష్ శర్మ 5 బంతుల్లోనే 18 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు.


అంతకు ముందు బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ కు ఓపెనర్లు జట్టుకు శుభారంభాన్ని ఇవ్వలేదు. పెద్దగా ఫాంలో లేని యశస్వీ జైస్వాల్ ఈ మ్యాచ్ లో కూడా తొలి వికెట్ రూపంలోనే 19 పరుగుల వద్ద ఔటయ్యారు. ఆ తరువాత వైభవ్ సూర్యవంశీ ఎప్పటిలాగే భారీ షాట్లు ఆడుతూ స్కోరు పెంచారు.21 బాల్స్ మాత్రమే ఎదుర్కొన్న వైభవ్ 46 పరుగులు చేశారు. 5 ఫోర్లు, 3 సిక్స్ లతో భారీగా పరుగులు రాబట్టారు. 8వ ఓవర్లో 89 పరుగుల వద్ద 2 వికెట్ ను రాజస్థాన్ కోల్పోయింది. ధృవ్ జురేల్ క్రీఉలో నిలదొక్కుని ఉండడంతో రియాన్ పరాగ్ వచ్చి రావడంతోనే ఫోర్లు , సిక్స్ లు మొదలు పెట్టి ఆర్ ఆర్ బౌలర్లపై ఆధిపత్యం చలాయించారు.15 వ ఓవర్లో 161 పరుగుల వద్ద పరాగ్ రూపంలో 3వ వికెట్ కోల్పోయింది. పరాగ్ 26 బాల్స్ 5 సిక్స్ లు 3 ఫోర్లతో 51 పరుగులు చేసి ఔటయ్యారు. ఆ తరువాత బ్యాటర్లు పరుగులు సాధించేందుకు నానా అవస్థలు పడ్డారు. జురేల్ కూడా40 బంతులు ఎదుర్కొని 53 పరుగులు చేసి ఔటయ్యారు. ఆ తరువాత మిగిలిన బ్యాటర్లంతా కలిసి 20 ఓవర్లు పూర్తయ్యే సరికి కేవలం 30 పరుగులు మాత్రమే జోడించారు. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 193 పరుగులు రాజస్థాన్ రాయల్స్ చేసింది.












Leave a Reply