(హైదరాబాద్,న్యూస్ఇన్)
జైపూర్ ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగాయి. నిలిచి ఉన్న రైల్లో ప్రమాదం సంభవించడంతో భారీ ప్రమాదం తప్పింది. రైలు లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. హైదరాబాద్ – జైపూర్ ఎక్స్ ప్రెస్ రైతు మరో గంట సేపట్లో నాంపల్లి స్టేషన్ నుంచి బయలు దేరేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఏసీ బోగిలైన B1,B2 బోగీలలో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడం మంటలు వేగంగా వ్యాప్తి చెందాయి. వెంటనే స్పందించిన అగ్ని మాపక సిబ్బంది తో పాటు సమాచారం అందుకున్నహైడ్రా సిబ్బంది స్టేషన్ కు చేరుకుని ప్రమాద తీవ్రతను అరికట్టారు. 7.30 గంటలకు బయలు దేరాల్సిన ఈ రైలులో సుమారు 6.30 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది.

ఆ సమయంలో బోగిల్లో ప్రయాణికులు లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రైలు ప్రారంభానికే ముందే ప్రమాదం చోటు చేసుకోవడంతో ప్రయాణికులు తమ గండం గట్టెక్కిందని అంటున్నారు. బోగీలలో పొగలు రావడాన్ని గమనించి ఫైర్, హైడ్రా కంట్రోల్ రూంకు సమాచారం ఇవ్వడంతో వెంటనే వారు నాంపల్లి స్టేషన్ కు చేరుకోవడం భారీ ప్రమాదం తప్పిపోయింది. మరో వైపు ఈ రైలు 10.20 గంటలకు బయటు దేరుతుందని రైల్వే అధికారులు ప్రకటించారు. దీంతో ఈ రైలు ప్రయాణికులకు ఆలస్యం జరిగినా పెద్దగా ఇబ్బంది కాకుండా రైల్వే అధికారులు చర్యలు చేపట్టడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు.










Leave a Reply