(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్)
పంజాబ్ కింగ్స్, ముంబాయి ఇండియన్స్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా మారి విజయం ముంబాయిని వరించింది. తిలకవర్మ క్రీజులో నిలదొక్కుకోవడంతో ముంబాయిని గెలిపించే ఇన్నింగ్స్ ఆడారు. పంజాబ్ సీజన్ మొదట్లో వరుసగా మ్యాచ్ లు విజయం సాధించి ఆ తరువాత చతికిల బడింది. ఈ మ్యాచ్ ఓటమితో వరుసగా 5 మ్యాచ్ లలో పంజాబ్ఓటమి చెందినట్లయింది.
ఆ తరువాత 201 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన ముంబాయికి ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందించారు. రికెల్టన్ ఒక్క సారిగా పంజాబ్ బౌలర్లపై విరుచుకు పడ్డారు. 23 బాల్స్ ఎదుర్కొని 4 ఫోర్లు, 4 సిక్స్ లతో 28 పరుగులు చేసి తొలి వికెట్ గా వెనుదిరిగారు.6 ఓవర్లలో ముంబాయి ఓపెనర్లు 61 పరుగులు చేశారు. ఆ తరువాత బ్యాటింగ్ కు వచ్చిన నమన్ ధీర్ 9 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యారు. క్రీజులో కుదురుకున్నట్లు కనిపించిన రోహిత్ శర్మ జట్టు స్కోరు 88 పరుగుల వద్ద 3 వ వికెట్ రూపంలో వెను దిరిగారు. 9.3 ఓవర వద్ద రోహిత్ ఔట్ కావడంతో.ముంబాయి చిక్కుల్లో పడింది. రూథర్ ఫర్డ్- తిలక వర్మలు స్కోరు జోరు పెంచారు రూథర్ ఫర్డ్ 16.3 ఓవర్ల వద్ద 149 పరుగుల స్కోరు దగ్గర ఔటయ్యారు. ఆ తరువాత తిలక్ వర్మ భారీ షాట్లు ఆడడం మొదలు పెట్టారు. జాక్స్, వర్మలు ముంబాయిని గెలుపుకు దగ్గర చేశారు. చివరి ఓవర్లో ముంబాయి విజయానికి 19 పరుగులు చేయాల్సి వచ్చింది. మొదటి బంతికే జాక్స్ సిక్స్ కొట్టారు. దీంతో 5 బంతుల్లో 9 పరుగులు మాత్రమే అవసరం అయ్యాయి. ఆ తరువాతి బంతికి జాక్స్ ఒక పరుగు తీసుకున్నారు. దీంతో చివరి నాలుగు బంతుల్లో 8 పరుగులు కావాల్సి వచ్చాయి.నాలుగో బంతికి పరుగులేమి రాలేదు. 3వ బంతికి సిక్స్ కొట్టడంతో ముంబాయి కి రెండు బంతుల్లో రెండు పరుగుల మాత్రమే కావాల్సి వచ్చాయి ఆ తరువాతి బంతికి వర్మ ఫోర్ కొట్టి ముంబాయి జట్టును గెలిపించారు. వర్మ కేవలం 33 బంతులు ఎదుర్కొని 73 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు.శార్దూల్ ఠాకూర్ నాలుగు వికెట్లు తీసుకుని పంజాబ్ బ్యాటర్లను కట్టడి చేశారు.


ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లల 200 పరుగులు చేసింది. ముంబాయి ఇండియన్స్ ఫీల్డర్లు క్యాచ్ లు జార విడవడంతో పంజాబ్ భారీ స్కోరు దిశగా అడుగులు వేసింది. ఈ సీజన్ లో జోరు మీదున్న పంజాబ్ ఓపెనర్ ప్రభ్ సిమ్రాన్ క్యాచ్ ముంబాయి జార విడవడంతో భారీ మూల్యం చెల్లించుకుంది. 5 పరుగుల లోపే లైఫ్ దక్కించుకున్న సిమ్రాన్ 32 బంతుల్లో 57 పరుగులు చేశారు. 6 ఫోర్లు,4 సిక్స్ లతో ముంబాయి బౌలర్లను ఆడుకున్నారు. మరో ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య 17 బాల్స్ లో 22 పరుగులు చేసి తొలి వికెట్ రూపంలో 5.3 ఓవర్లలో 50 పరుగుల వద్ద కోల్పోయింది. 12 వ ఓవర్లో 107 పరుగుల స్కోరు వద్ద ప్రభ్ సిమ్రాన్ ఔటయ్యారు. ఆ తరువాత పంజాబ్ కింగ్స్ త్వర త్వరగా వికెట్లు కోల్పోయింది. శ్రేయస్ అయ్యర్, కూపర్ కాన్లీ, షిడ్గేలు వికెట్లు 14 వ ఓవర్ వరకే పంజాబ్ కోల్పోయింది. శ్రేయస్ 4, కాన్లీ 21, షిడ్గే 8 పరుగులు చేసి వెనుదిరిగారు. 17వ ఓవర్ వరకు 140 పరుగులకు పంజాబ్ స్కోరు చేసి 7 వికెట్లు కోల్పోయింది. చివరి ఓవర్లలో అజ్మత్తుల్లా భారీ హిట్టింగ్ చేయడంతో పంజాబ్ స్కోరు 20 ఓవర్లలో 200 పరుగులు చేసింది.












Leave a Reply