NewsInn

News in a Click

అసెంబ్లీలో బ‌ల‌ప‌రీక్ష‌ – నెగ్గిన జోసెఫ్ విజ‌య్

అసెంబ్లీలో బ‌ల‌ప‌రీక్ష‌ – నెగ్గిన జోసెఫ్ విజ‌య్

(చెన్నై,న్యూస్ఇన్‌)

త‌మిళ‌నాడు అసెంబ్లీలో ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ బ‌ల‌ప‌రీక్ష‌లో నెగ్గారు. త‌మిళ‌నాడులో సంపూర్ణ మెజార్టీ ఏ పార్టీకి రాకపోవ‌డంతో ఉత్కంఠ ప‌రిస్థితుల మ‌ధ్య విజ‌య్ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. 107 స్థానాల‌ను గెలుచుకున్న విజ‌య్ కు 11 స్థానాలు మెజార్టీకి త‌క్కువ‌య్యాయి. కాంగ్రెస్, వామ‌ప‌క్షాలు, ఐయుఎంఎల్ పార్టీలు సీఎం గా విజ‌య్ బాద్య‌త‌లు చేపట్టేందుకుముందుగానే మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో సీఎంగా విజ‌య్ ద‌ళ‌ప‌తి ప్ర‌మాణ స్వీకారం చేసుకుని అసెంబ్లీలో బ‌ల‌నిరూప‌ణ‌కు సిద్ధం కావ‌ల్సి కావ‌చ్చి వ‌చ్చింది. దీంతో త‌మిళ రాజ‌కీయాలు అనూహ్యంగా మారిపోయాయి. ముఖ్య‌మంత్రిగా విజ‌య్ కు మ‌ద్ద‌తు తెలిపేందుకు ఏఐఏడిఎం పార్టీ నేత ప‌ళ‌నిస్వామి వెనుక‌డుగు వేయ‌డంతో ఆ పార్టీ ఉనికికే ప్ర‌మాదం ప్ర‌స్తుతం నెల‌కొంది.

47 మంది శాస‌న‌స‌భ్యులు ఏఐఏడిఎం త‌ర‌పున ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు. సంపూర్ణ మెజార్టీ రాని విజ‌య్ కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని మెజార్టీ పార్టీ ఎమ్మెల్యేలు త‌మ అభిప్రాయంగా చెప్పినా…ప‌ళ‌ని స్వామి డీఎంకే తో తాను సీఎం అయ్యేందుకు చ‌ర్చ‌లు జ‌రుప‌డం ఏఐఏడిఎం కే ఎమ్మెల్యేల‌కు న‌చ్చ‌లేదు. దీంతో పార్టీలో సీనియ‌ర్ ఎమ్మెల్యేగా ఉన్న శ‌ణ్ముణం ప‌ళ‌ని స్వామిపై తిరుగుబాటు జెండా ఎగుర‌వేశారు. 30 మంది శాస‌న‌స‌భ్యుల‌తో క‌లిసి బ‌ల‌నిరూప‌ణ‌కు విజయ్ కు మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో విజ‌య్ ప్ర‌భుత్వం త‌మిళ నాడులో మ‌రింత బ‌ల‌ప‌డిన‌ట్ల‌యింది. 234 మంది శాస‌న‌స‌భ్యులున్న త‌మిళ అసెంబ్లీలో విజ‌య్ బ‌ల‌నిరూప‌ణ‌లో 144 మంది స‌భ్యుల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *