NewsInn

News in a Click

కాశ్మీర్ కు అందుబాటులోకి వ‌చ్చిన లాజిస్టిక్ ట్రైన్

స‌రుకు ర‌వాణ‌కు ఊతం

(న్యూఢిల్లీ,న్యూస్ఇన్‌)

కాశ్మీర్ లోయ‌కు రైల్వే లాజిస్టిక్ సౌక‌ర్యం అందుబాటులోకి వ‌చ్చింది. ఫుడ్ కార్పోరేష‌న్ (FCI)
మొట్టమొదటి ఫుడ్‌గ్రెయిన్ రైలు అనంతనాగ్ గూడ్స్ టెర్మినల్‌కు చేరుకుంది దీంతో ఈ ప్రాంతం అధికారికంగా జాతీయ ఫ్రైట్ రైలు నెట్‌వర్క్‌తో అనుసంధానంలోకి వ‌చ్చిన‌ట్ల‌యింది. మొద‌టి ట్రైన్ వ్యాగన్ల ద్వారా 1,384 టన్నుల ఆహార ధాన్యాలు , సరుకు రవాణా రేక్ అజిత్వాల్ రైల్వే స్టేషన్ నుండి అనంతనాగ్ గూడ్స్ టెర్మినల్‌కు చేరుకుంది.కాశ్మీర్ లోయకు, మారుమూల సుదూర ప్రాంతాల నుంచి స‌రుకు ర‌వాణాకు సులువుగా మారింది.

స‌రుకు ర‌వాణాకు ట్రాక్ అందుబాటులోకి రావ‌డంతో ఖ‌ర్చులు భారీగా త‌గ్గ‌నున్నాయి. ఇది స్థానిక మార్కెట్లకు ఎంతో క‌లిసి వ‌స్తోందని వ్యాపార‌వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. ఈ సౌక‌ర్యం వ్య‌వ‌సాయ ప‌రంగా కూడా ప్రాతీయంగా క‌లిసి వ‌స్తూనే వ్యాపార లావా దేవీలు సౌక‌ర్య‌వంతంగా జ‌రిగేందుకు దోహ‌ద‌ప‌డుతుంద‌ని మార్కెట్ వ‌ర్గాలు భావిస్తున్నాయి. అనంతనాగ్ గూడ్స్ టెర్మినల్ అందుబాటులోకి రావ‌డంతో ఇక నిత్యావసర వస్తువులు, ఇతర వస్తువుల తరలింపుకు ఎంతో సౌక‌ర్య‌వంతంగా మారనుంది. గ‌తంలో పోలిస్లే స‌రుకు ర‌వాణా విధానం మార‌డంతో ధ‌ర‌లు కూడా త‌గ్గే అవ‌కాశం ఉంద‌న్న అభిప్రాయం వినిపిస్తోంది. ఈ ప్రాంతం రైల్ రవాణాకు అందుబాటులోకి రావ‌డంతో దేశంలోని ఇత‌ర‌ ప్రాంతాలతో కాశ్మీర్ లోయ‌కు క‌నెక్టివిటీ మ‌రింత పెరిగిన‌ట్ల‌యింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *