NewsInn

News in a Click

బీఆర్ఎస్ ను హస్తగతం చేసుకునేందుకు గుంటనక్క కుట్ర

బీఆర్ఎస్ ను హస్తగతం చేసుకునేందుకు గుంటనక్క కుట్ర

(న్యూస్ఇన్‌,హైద‌రాబాద్)

బీఆర్ఎస్ ను హ‌స్త గ‌తం చేసుకునేందుకు హ‌రీష్ రావ్ కుట్ర‌లు చేస్తున్నార‌ని టీఆర్ ఎస్ అధినేత్రి క‌విత తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. మెద‌క్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేల‌తో ర‌హ‌స్య మంత‌నాలు చేశార‌ని, కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచే య‌త్నం చేస్తున్నార‌న్నారు.బీఆర్ ఎస్ ను హ‌స్త గ‌తం చేసుకున్న త‌రువాత బీజేపీ మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టే య‌త్నాల‌ను హ‌రీష్ రావ్ చేస్తున్నార‌ని క‌విత తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.అటు గుంపు మేస్త్రీతో, మ‌రోవూపు బీజేపీతో స‌న్నిహితంగా ఉంటున్నార‌ని ఆరోపించారు.మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఆంధ్రా వ్యాపార సంస్థ‌ల‌తో వేల కోట్ల రుపాయల వ్యాపారాలు చేశార‌న్నారు. గుంపుమేస్త్రీ, గుంట‌ల న‌క్క‌లు ఇటీవ‌ల లండ‌న్ ప‌ర్య‌నలో ఎన్నో అంశాల‌పై చ‌ర్చ‌లు జ‌రిపార‌న్నారు. లండ‌న్ ర‌హ‌స్య మంత‌నాల‌ను టీఆర్ ఎస్ బ‌య‌ట‌పెడుతుంద‌ని వెల్ల‌డించారు. ముఖ్య‌మంత్రి ఆంధ్రా రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. తెలంగాణా ప్ర‌యోజ‌నాల‌ను ముఖ్య‌మంత్రి రేవంత్ తాక‌ట్టు పెడుతున్నా…బీఆర్ ఎస్ స్పందించ‌డం లేద‌న్నారు. బీఆర్ ఎస్ కాంగ్రెస్ పార్టీతో క‌లిసి పోయింద‌న్నారు. లండన్ లో గుంటనక్కతో లాలూచీ లేకపోతే ఆయన మీద క్విడ్ ప్రో కో కేసు నమోదు చేయాలని క‌విత డిమాండ్ చేశారు. ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న సమయంలో హరీష్ రావు కార్పొరేట్ సంస్థలకు పెద్ద ఎత్తున పాలు పోసి వ్యాపారం చేశాడుని, నారాయణ, చైతన్య కాలేజ్ లకే నెలకు 5 కోట్ల చొప్పున 8 ఏళ్లుగా 960 కోట్ల వ్యాపారం చేశార‌ని ఆరోపించారు.ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనను అడ్డుకుంటే ఆయ‌న‌కు తెలంగాణ గుర్తు వచ్చిందన్నారు. తెలంగాణాలోని ప‌లు విభాగాల్లో ఆంధ్రా వాళ్ల పెత్త‌నం న‌డుస్తోంద‌న్నారు. తెలంగాణా బ్రాహ్మ‌ణ ప‌రిష‌త్ చైర్మ‌న్ గా ఆంధ్రా వ్య‌క్తికి ఇవ్వ‌డం ఎంత వ‌ర‌కు సమంజ‌స‌మ‌ని ప్ర‌శ్నించారు. య‌దాద్రి బోర్డులో కూడా ఆంధ్రా వారికి అవ‌కాశం క‌ల్పించార‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *