NewsInn

News in a Click

తెలంగాణలో‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’ 8 వ ఎడిషన్

తెలంగాణలో‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’ 8 వ ఎడిషన్

(న్యూస్ఇన్‌, హైద‌రాబాద్‌)

తెలంగాణాలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ డిసెంబ‌ర్ లో నిర్వ‌హించేందుకు కౌంట్ డౌన్ మొద‌లైంది. 2036 ఒలెంపిక్స్ ల‌క్ష్యంగా కేంద్ర ప్ర‌భుత్వం ఖేలో ఇండియాను ప్ర‌మోట్ చేస్తోంది. ఒలింపిక్స్ లో ప‌త‌కాల ప‌ట్టిక‌లో మెరుగు ప‌డాల‌న్న ల‌క్ష్యంగా కేంద్రం ఖేలో ఇండియా పేరుతో ప్రణాళిక‌ల‌ను అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించింది. అందులో భాగంగా సరైన క్రీడాసదుపాయాలను, అవసరమైన ప్రోత్సాహాన్ని కల్పించి.. వారిలోని శక్తిసామర్థ్యాలకు పదునుపెట్టడంతోపాటుగా వారికి క్రీడారంగంలో ఉజ్వలమైన భవిష్యత్తును అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తోంది.

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పోటీలు…..

ఈ ఏడాది జరగనున్న 8వ ఎడిషన్ ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’ ను హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్ వేదికగా ఈ పోటీలను నిర్వహించనున్నారు. వేదికగా నిర్వహించనున్నారు. ఈ ఎడిషన్‌లో మొత్తం 25 క్రీడల్లో పోటీలు నిర్వహించనున్నారు. ఆతిథ్య రాష్ట్రమైన తెలంగాణ.. ఒక స్థానిక క్రీడను ప్రతిపాదించవచ్చు. దీంతోపాటుగా మరో కొత్త క్రీడను కూడా ఈ ఈవెంట్లో ఆడించనున్నారు. ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా 6వేల మంది స్పోర్ట్స్ పర్సన్స్ పాల్గొనే అవ‌కాశం ఉంది.

క్రీడ‌ల‌కు ప్రోత్సాహం…..

క్రీడారంగంలో రాణిస్తున్న వారిని ప్రోత్స‌హించేందుకు .. కేంద్ర ప్రభుత్వం 2015లో పద్మశ్రీ, 2020లో పద్మభూషణ్ అవార్డును అందించింది. ఇలాంటి క్రీడాకారులెందరికో.. కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. 2014కు ముందు మొత్తం 23 ఒలింపిక్స్ ఎడిషన్లలో.. 23 పతకాలు సాధించగా.. 2014 నుంచి 2024 వరకు మూడు ఎడిషన్లలో 15 పతకాలు సాధించాం. పారాలింపిక్స్ లోనూ.. 2014కు ముందు దేశం కేవలం 8 పతకాలు సాధించగా.. 2014 నుంచి 2024 పారాలింపిక్స్ లో.. 52 పతకాలు సాధించాం. 2014కు ముందు దేశంలో స్పోర్ట్స్ బడ్జెట్ రూ.1,219 కోట్లుండగా.. 2025-26లో ఇది రూ.3,794 కోట్లకు పెరిగింది. దేశంలో 2014కు ముందు రూ.191 కోట్ల విలువైన 38 స్పోర్ట్స్ ప్రాజెక్టులుండగా.. ఈ 12 ఏళ్లలో.. 350 స్పోర్ట్స్ ఇన్‌ఫ్రా ప్రాజెక్టులు పూర్తయ్యాయి. వీటి విలువ రూ.3,181 కోట్లు.

ప్ర‌ధాని ప్ర‌సంగం….

మరోవైపు, ఆగస్టు 29న నేషనల్ స్పోర్ట్స్ డే ను పురస్కరించుకుని.. గురువారం (ఆగస్టు 27న).. దేశవ్యాప్తంగా ‘ఖేల్ కీ బాత్, పీఎం కే సాథ్’ పేరుతో ఖేలో ఇండియా సంవాద్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. దేశ వ్యాప్తంగా ప్రతి జిల్లా నుంచి.. 2 కాలేజీల చొప్పున 1,500 లకు పైగా కాలేజీలలో ఈ కార్యక్రమాన్నినిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా క్రీడలు, ఫిట్‌నెస్ తో పాటు యువత నేతృత్వంలో దేశ నిర్మాణానికి సంబంధించిన అంశాల మీద ప్రధానమంత్రి మోదీ వర్చువల్ గా ప్రసంగించడంతోపాటు క్రీడల పట్ల యువత ఆలోచనలు, ఆకాంక్షల గురించి వారితో మాట్లాడి తెలుసుకోనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *