కుంభమేళాకే 17 ,340 రైళ్లు
రైల్వే శాఖ కు ప్రత్యేకం
(హైదరాబాద్,న్యూస్ఇన్)
ఈ ఏడాది భారత రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు నడపడంలో రికార్డు సృష్టించింది. వివిధ కార్యక్రమాల నేపథ్యంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. రోజు కోట్లాది మంది ప్రయాణికులను సురక్షితంగా తమ గమ్య స్థనాలకు చేరుస్తోంది. ఈ ఏడాది వచ్చిన పలు ఈవెంట్లను కూడా రైల్వే ప్రయాణికులకు సౌకర్యవంతంగా పెద్ద ఎత్తున ప్రత్యేక రైళ్లను నడిపి సౌకర్య వంతంగా ప్రయాణికులను తమ గమ్యానికి చేర్చింది.

రైల్వే శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం 43 వేల రైళ్లను ఈ ఏడాది దేశ వ్యాప్తంగా రైల్వేశాఖ నడిపింది. దేశ ప్రజలను ఉత్తర్ ప్రదేశ్ వైపు నడిపించిన కుంభ మేళా సందర్బంగా దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి అక్కడికి చేరుకునేందుకు 17,340 రైళ్లను నడిపింది. దీంతో పాటు ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల్లో ప్రజలు ఎక్కువగా తమ సొంత గ్రామాలకు వెళ్లే పండుగలకు కూడా పెద్ద ఎత్తున రైళ్లను నడిపింది.హోలీ పండుగ కోసం 1,144 రైళ్లను నడిపించగా….. వేసవి సెలవుల్లో ప్రయాణికుల రద్దీ కి అనుగుణంగా 12,417 రైళ్లు ఏర్పాటు చేసింది. ఛత్ పూజ కోసం మరో 12,383 ప్రత్యేక రైలు సర్వీసులు నడిపించిందిపెరిగిన ప్రయాణికుల డిమాండ్ను తీర్చడంలో ,దేశవ్యాప్తంగా నిరంతరాయ కనెక్టివిటీని అందించడంలో రైల్వేశాఖ ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది.

2025లో మహా కుంభమేళా కోసం పెద్ద సంఖ్యలో యాత్రికుల రాకపోకలకు సౌకర్యవంతంగా ఉండేందుకు జనవరి 13 నుండి ఫిబ్రవరి 28 మధ్య 17,340 ప్రత్యేక రైలు సర్వీసులను నడిపింది. 2025 మార్చి 1 నుండి మార్చి 22 వరకు జరిగిన హోలీ పండుగ కోసం, 1,144 ప్రత్యేక రైలు సర్వీసులు నడపబడ్డాయి, ఇది 2024 హోలీ సమయంలో నడిపిన వాటి సంఖ్యకు దాదాపు రెట్టింపు, 2025 వేసవి ప్రయాణ సీజన్లో, ఏప్రిల్ 1 నుండి జూన్ 30 వరకు, 12,417 వేసవి ప్రత్యేక రైలు సర్వీసులను నడపించింది. ఛత్ పూజ కోసం అక్టోబర్ 1 నుండి నవంబర్ 30 వరకు 12,383 ప్రత్యేక రైలు సర్వీసులను నిర్వహించింది. 2024 లో నడిపించిన ప్రత్యేక రైళ్లను నడిపించడంలో వచ్చిన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని 2025 లో ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా రైల్వే శాఖ అన్ని ముందస్తు చర్యలు చేపట్టి ఏర్పాట్లు చేసింది.





Leave a Reply