(న్యూస్ఇన్, హైదరాబాద్)
కేసీఆర్ ఫాం హౌస్ భూములతో పాటు కూడబెట్టిన ఆస్తులపై కూడా విచారణ కు తాము సిద్ధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సిద్ధం కావాలని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ సవాల్ విసిరారు.సీఎం అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను కేటిఆర్ తప్పు బట్టారు. కేసీఆర్ ఫామ్హౌస్ వెయ్యి ఎకరాల్లో ఉందంటూ ఇంతకాలం ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి.. అసెంబ్లీ సాక్షిగా అది కేవలం 67 ఎకరాలు మాత్రమేనని అంగీకరించారని చెప్పారు. వెయ్యి ఎకరాల ఫామ్హౌస్ అంటూ చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాజకీయ విమర్శల కంటే వాస్తవాలను తేల్చేందుకు విచారణకు తాము సిద్ధమని ప్రకటించారు.
ఆస్తులపై విచారణకు సిద్ధమన్న కేటీఆర్..
కేసీఆర్ పుట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు తమ కుటుంబం కూడబెట్టిన ఆస్తులు, రేవంత్ రెడ్డి పుట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు ఆయన కుటుంబ ఆస్తులపై హైకోర్టు లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని కేటీఆర్ సవాల్ చేశారు. ఈ విచారణకు ముఖ్యమంత్రి సిద్ధమా అని ప్రశ్నించారు.

కేసీఆర్ ప్రతి ఎన్నికల సమయంలో అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారని కేటీఆర్ చెప్పారు. వ్యవసాయంపై కేసీఆర్కు మొదటి నుంచీ ఆసక్తి ఉందని, ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ, ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలోనూ వ్యవసాయం చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
రాజకీయ ఆరోపణలు వద్దన్న కేటీఆర్….
కేసీఆర్ చట్టబద్ధంగా కొనుగోలు చేసిన భూములపై బురదజల్లే ప్రయత్నం జరుగుతోందని కేటీఆర్ ఆరోపించారు. తన కుటుంబానికి భూమితో ఉన్న అనుబంధాన్ని వివరిస్తూ.. కేసీఆర్ తండ్రికి వందల ఎకరాల భూమి ఉండేదని, చింతమడకలోని రెండు ఎకరాల ఇంటిని కూడా ప్రభుత్వ పాఠశాలకు రాసిచ్చారని చెప్పారు. ప్రగతి భవన్పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా కేటీఆర్ ప్రస్తావించారు. 150 బెడ్రూంలు, బంగారు బాత్రూంలు వంటి వ్యాఖ్యల్లో ఎంత నిజం ఉందో.. తాజాగా కేసీఆర్ ఫామ్హౌస్పై చేసిన ఆరోపణల్లోనూ అంతే నిజం ఉందన్నారు.
ఆరు గ్యారంటీలు అమలయ్యాయని ప్రభుత్వం చెబుతున్న తీరుపైనా కేటీఆర్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఫామ్హౌస్ భూముల అంశాన్ని రాజకీయ విమర్శల నుంచి వాస్తవాల పరిశీలనకు తీసుకెళ్లాలని కోరారు.












Leave a Reply