(న్యూఢిల్లీ, న్యూస్ఇన్)
తమిళ రాజకీయాల్లో సంచలనంగా మారిన విజయ దళపతి పొలిటికల్ ఎంట్రీ ఎంత గ్రాండ్ గా జరిగిందో అంతే విషాదం నింపింది. టీవీకే సభకు భారీగా జనం రావడంతో తొక్కిసలాట జరిగి జాతీయ స్థాయిలో ఈ ఘటన విషాదం నింపింది.టీవీకే అధినేతగా సినీ నటుడు విజయ్ కు ప్రాధాన్యతన ఈ తొక్కిసలాటతో తేటతెల్లమైంది. కానీ ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపాలని డిమాండ్ రావడంతో భారత అత్యున్నత న్యాయ స్థానం స్పందించింది. ఈ ఘటనపై విచారణను సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ కేసుకు సంబంధించి కీలక సమాచారం సేకరించేందుకు తమిళ వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత దళపతి విజయ్ కి ఇవాళ సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులలో ఈ నెల 12న విచారణకు రావాలని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ మేరకు దేశ రాజధాని ఢిల్లీ (Dehli)లోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో విజయ్ని విచారించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

కాగా, హీరో విజయ్ టీవీకే పార్టీ కరూర్లోని వేలుసామిపురం లో భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయను చూసేందుకు అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ విషాద ఘటనలో 40 మందికి పైగా మరణించగా, వంద మందికి పై గాయపడ్డారు. ప్రారంభంలో స్థానిక పోలీసులు ఈ కేసును విచారించినప్పటికీ, బాధితులకు న్యాయం జరగాలంటే స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని డిమాండ్లు వచ్చాయి. ఈ క్రమంలోనే దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని, గతేడాది అక్టోబర్లో ఈ కేసును సీబీఐకి అప్పగించింది. అలాగే, విచారణను పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలో ఒక పర్యవేక్షణ కమిటీని కూడా ఏర్పాటు చేసింది.







Leave a Reply