ఒగ్గు కళాకారులతో చౌడమ్మ తల్లి విశేషాలు
(హైదరాబాద్,న్యూస్ఇన్)

కంది మండలం ఎర్దనూరు గ్రామంలో జరిగిన శ్రీ చౌడమ్మ తల్లి జాతర ఉత్సవంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాల్గొన్నారు.చౌడమ్మ తల్లి వారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చౌడమ్మ తల్లి చరిత్ర గురించిన విశేషాలను వివరిస్తూ, ఒగ్గు కళాకారులు పాడిన పాటలను ఎంతో ఆసక్తిగా విన్నారు. ఎర్దనూరు గుట్టపైన కొలువైన దేవతామూర్తుల దగ్గరకు ఊరేగింపుగా వెళ్లి దర్శించుకున్నారు. చౌడమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి జూలకంటి ఆంజనేయులు, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రఘుగౌడ్, ఎర్దనూరు సర్పంచ్ పంబళ్ల జ్యోతి దుర్గాప్రసాద్, కాంగ్రెస్ నాయకులు మధు తదితరులు పాల్గొన్నారు.






Leave a Reply