NewsInn

News in a Click

హజ్రత్ ఫతే ఖాన్ దర్గా 141వ ఉర్సు ఉత్సవాలు

పాల్గొన్న TPCCవర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

(హైద‌రాబాద్ న్యూస్ఇన్)

సంగారెడ్డి పట్టణం లోని ప్రసిద్ధ ఫతేఖాన్ దర్గా 141 ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం ప్రారంభమైన ఈ ఉత్సవాలు ఆదివారం తో ముగుస్తాయి. టీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫతేఖాన్ దర్గా ను మైనార్టీ నేతలు దర్గా కమిటీ సభ్యులు వక్ఫ్ అధికారులతో కలిసి సందర్శించారు. ఫతే ఖాన్ బాబా దర్గా లో చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.. అనంతరం ఖవ్వాలి కార్యక్రమంలో పాల్గొని అందరికి ఫతే ఖాన్ దర్గా ఉర్సు ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు. ఉర్స్ ఉత్సవాలకు వచ్చిన యాత్రికులతో జగ్గారెడ్డి మాట్లాడారు. యాత్రికులకు భోజన వసతి, మంచి నీళ్లు లాంటి ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా చూడాలని దర్గా కమిటీ సభ్యులకు సూచన చేశారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్
హాఫిజ్ షేక్ షఫీ, మొయిజ్ తాహేర్ కూన సంతోష్ కిరణ్ గౌడ్ ,గౌస్ మరియు వక్ఫ్ అధికారులు సంగారెడ్డి పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *