ఎన్నికల ప్రచారంలో కేటీఆర్

(హైదరాబాద్,న్యూస్ఇన్)
తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా ఉన్న వారిలో నీచమైన సీఎం రేవంత్ రెడ్డే అని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ విమర్వించారు. ప్రజలను, ప్రతిపక్షాలను, చివరికి ఆడబిడ్డలను అడ్డగోలుగా తిడుతూ నీచమైన మాటలు మాట్లాడుతున్న వ్యక్తి రేవంత్ రెడ్డి అని అన్నారు. ఎంతో మంది ముఖ్యమంత్రుల్ని చూశామని, కానీ ఇంత దారుణంగా మాట్లాడిన నీచమైన వ్యక్తి ఇంకెవరూ లేరని కేటీఆర్ అన్నారు. ఏ ముఖ్యమంత్రి అయినా రాష్ట్రంలో ఒక పట్టణానికి వస్తే ఆ పట్టణానికి చేసే అభివృద్ధి కార్యక్రమాలు చెబుతారు, కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఏ పట్టణానికి వెళ్లినా అడ్డగోలుగా బూతులు మాట్లాడడం తప్పించి చేస్తున్నది ఏమీ లేదన్నారు.కేవలం కేసీఆర్ ను బూతులు తిట్టాలనే ఏకైక ఉద్దేశంతో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారన్నారు. రెండు సంవత్సరాల్లో జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో పండుకోవడం తప్పించి పరిపాలన చేసింది లేదని రేవంత్ రెడ్డిని విమర్శించారు.

ప్రతిరోజూ వందల కోట్ల రూపాయలు దోచుకోవడమే ఏకైక అజెండా పెట్టుకొని అవినీతికి రేవంత్ రెడ్డి పాల్పడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, ఆరు గ్యారంటీల అమలు వైఫల్యాన్ని ఎత్తి చూపారు. తాండూరులో ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో 36కు 36 వార్డులను కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తే కాంగ్రెస్ కి గట్టి గుణపాఠం అవుతుందని కేటీఆర్ ప్రజలకు తమ పార్టీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.





Leave a Reply