- నివాసం వద్ద ఉద్రిక్తత
(హైదరాబాద్,న్యూస్ఇన్)

ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నిబంధనలు ఉల్లంఘించారని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.ఈ కేసులో రోహిత్ రెడ్డిని అదుపులోకి తీసుకెళ్లేందుకు నగరంలోని ఆయన నివాసానికి పెద్ద ఎత్తున పోలీసులు చేరుకోవడం కలకలం రేపింది. సాయంత్రం 7 గంటల సయంలో మనికొండ లోని ఆయన నివాసినిక వికారాబాద్, తాండూరు కు చెందిన పోలీసులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు అక్కడికి చేరుకున్న సమయంలో రోహిత్ రెడ్డి నివాసంలో లేకపోవడంతో ముందు వెనుదిరిగారు. కానీ పోలీసులు ఆయనను అరెస్టు చేసేందుకు వస్తున్నారనే సమాచారంతో పెద్ద ఎత్తున ఆయన అనుచరులు మనికొండ లోని రోహిత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. పోలీసులు రావడాన్ని ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు వీడియో తీస్తుండగా పోలీసులు వారి దగ్గర నుంచి ఫోన్లు లాక్కొని హెచ్చరించారు. దీంతో మరింత టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే ఆ సమయంలో మాజీఎమ్మల్యే నివాసంలో లేకపోవడంతో ఆయనను అరెస్టు చేసేందుకు ఆయన ఏఏ ప్రాంతాల్లో ఉంటారన్నదానిపై ఆరా తీస్తూ…అన్నిచోట్ల ను పోలీసులు జల్లెడ పడుతున్నారు.

కేసు ఎందుకు నమోదు చేశారంటే….
ఈ నెల 13వ తేదీన ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లడాన్ని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తో పాటు ఆయన అనుచరులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు తమ విధులకు రోహిత్ రెడ్డి ఆటంకం కల్గించారని ఐపీసీ 185,353 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అక్రమ కేసు…..
ఇది ప్రభుత్వం కుట్ర పూరితంగా మా పార్టీ మాజీ ఎమ్మెల్యేపై నమోదుచేసిన కేసు అని బీఆర్ ఎస్ ఆరోపిస్తోంది.బీఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ ఖంఢించారు. అక్రమ కేసు నమోదు చేయడంతో ఆయన కుటుంబ సభ్యులను పోలీసులు భయ భ్రాంతులకు గురిచేయడం సమంజసం కాదన్నారు.





Leave a Reply