(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్)
ఇంగ్లాండ్ జరిగే లీగ్ మ్యాచ్ ల కోసం కావ్యామారన్ ఆటగాళ్ల కొనుగోలు వ్యవహారం భారత్ లో దూమారం రేపుతోంది.భారత్ లో కీలకమైన ఎస్ ఆర్ హెచ్ జట్టు అధినేతగా ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. ది హండ్రెడ్ కు సంబంధించి కావ్యామారన్ పాక్ ఆటగాళ్లను కొనుగోలు చేసిందని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాక్ ఆటగాళ్లలో భారత్ ను రెచ్చగొట్టే విధంగా గతంలో జరిగిన మ్యాచ్ లలో వ్యవహరించిన అ్రబార్ అహ్మద్ కొనుగోలు చేశారన్నది సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం.

సన్ రైజర్స్ లీడ్స్ ద హండ్రెడ్ వేలంలో భాగంగా పాక్ ఆటగాడు స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ను కొనుగోలు చేశారనే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో భారత్ లో కూడా తీవ్ర చర్చకు దారి తీస్తోంది. సోషల్ మీడియా వేదికగానే అబ్రార్ కొనుగోలను భారత క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎక్స్ లో ఈ విషయం ప్రకటించిన వెంటనే ఎక్స్ అకౌంట్ సస్పెండ్ కావడం ఆసక్తి రేపుతున్న అంశంగా మారింది.
భారత్-పాకిస్తాన్ మధ్య ఉన్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ ఆటగాడిని తీసుకోవడం సరైన నిర్ణయం కాదని భారత క్రికెట్ అభిమానులు ఈ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో హ్యాష్ట్యాగ్లు ట్రెండ్ అయ్యాయి.
అకస్మాత్తుగా సస్పెండ్ అయిన X అకౌంట్…

వివాదం జరుగుతున్న సమయంలోనే సన్రైజర్స్ లీడ్స్ అధికారిక X అకౌంట్ అకస్మాత్తుగా సస్పెండ్ కావడం పరిస్థితిని మరింత ఆసక్తికరంగా మార్చింది. ప్రస్తుతం ఆ అకౌంట్ను ఓపెన్ చేస్తే “Account suspended” అనే మాత్రమే కనిపిస్తోంది. భారత క్రికెట్ అభిమానులు, ఎక్స్ యూజర్లు రిపోర్ట్ చేయడం కారణంగా అకౌంట్పై ఒత్తిడి పెరగడం ఒక కారణమనే అభిప్రాయం వినిపిస్తోంది.
SRH అకౌంట్ అంటూ…
సన్ రైజర్స్ హైదరాబాద్ అకౌంట్ ఎక్స్ లో సస్పెండ్ అయిందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది…కానీ దీంతో నిజం ఏమాత్రం లేదు…. సన్ రైజర్స్ లీడ్స్ కు సంబంధించిన అకౌంట్ మాత్రమే ఎక్స్ లో సస్పెండ్ అయింది,.పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ కొనుగోలు తర్వాత సన్రైజర్స్ లీడ్స్ X అకౌంట్ సస్పెండ్ కావడం ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్గా మారింది.
అభిమానుల భావోద్వేగమే…
భారత్లో క్రికెట్ అంటే ప్రత్యేకమైన భావోద్వేగం. ముఖ్యంగా భారత్-పాకిస్తాన్ మ్యాచ్లకు ప్రాధాన్యం ఇరు దేశాల్లో కూడా క్రికెట్ అభిమానులు గెలిచిన జట్టును భుజాలను ఎక్కించుకోవడం…ఓడిపోతే విమర్శలు గుప్పించడం సహజంగా జరుగుతోంది. ఇటీవల టీ-20 ప్రపంచ కప్ లో భారత్ చేతిలో పాక్ ఓటమితో పాక్ క్రికెట్ బోర్డులో ఈ అంశం పెద్ద సంక్షోభానికి దారి తీసింది. ఆటగాళ్లు, మాజీ ఆటగాళ్లు, బోర్డు ఎవరికి తోచినట్లు వారు స్టేట్ మెంట్లు ప్రపంచ క్రికెట్లో వారి పరువు వారే తీసుకున్నంత పనిచేశారు.
కావ్య పాపను చుట్టుమట్టిన పాక్ క్రికెటర్ల కొనుగోలు వివాదం…..







Leave a Reply