NewsInn

News in a Click

28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక స‌మావేశం..?

(అమరావతి, న్యూస్ఇన్‌)

ఈ నెల 28న రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించాల‌ని ఆంధ్ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.. అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని ప్రభుత్వం ప్ర‌త్యేక స‌మావేశాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే అమరావతిపై కేంద్రం నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంది. ఈ సంకేతాల‌తోనే రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అసెంబ్లీ నిర్వ‌హ‌ణ‌కు వెంట‌నే నిర్ణ‌యం తీసుకున్నట్లు తెలుస్తోంది. తొలివిడత అధికారం చేప‌ట్టిన టీడీపీ అమ‌రావ‌తి రాజ‌ధానిగా నిర్ణ‌యం తీసుకుంది…..కానీ రాజ‌ధాని స్థాయిలో సౌక‌ర్యాలు ఆ ప్ర‌భుత్వం హాయంలో క‌ల్పించ‌లేక‌ప‌పోయింది. ఆ త‌రువాత వైసీపీ అధికారంలోకి రావ‌డంతో అమ‌రావ‌తి రాజ‌ధాని మార్చాల‌ని నిర్ణ‌యం తీసుకుంది.

అయితే 2024 ఎన్నిక‌ల్లో మ‌రోసారి కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి రావ‌డ‌తో ముఖ్య‌మంత్రి గా చంద్ర‌బాబు మ‌రోసారి ప‌ద‌వీ బాద్య‌త‌లు చేప‌ట్టారు. ఎన్నిక‌ల‌కు ముందు నుంచి ఎన్డీఏ తో మిత్ర పక్షంగా వ్య‌వ‌హ‌రించ‌డంతో జాతీయ స్థాయిలో టీడీపీ కీల‌క పార్టీగా అవ‌త‌రించింది. దీంతో చంద్ర‌బాబు ప్ర‌తిపాద‌న‌ల‌కు కేంద్రం దాదాపు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చే ప‌రిస్థితి నెలకొంది. ఇదే అవ‌కాశం గా బాబు అమ‌రాతిని ఈ విడ‌త ప్ర‌భుత్వ హాయంలో రాజ‌ధానిగా ఒక స్థిర‌మైన రూపం తెచ్చేందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే కేంద్ర ప్ర‌భుత్వం అమ‌రావ‌తి రాజ‌ధానిగా అసెంబ్లీ తీర్మానం చేస్తే పార్ల‌మెంట్ స‌మావేశాల్లోనే ఆమోద ముద్ర వేసేందుకు కేంద్రం రెడీ అన్న సంకేతాలు ఇచ్చింది. దీంతో 28వ తేదీన ఏపీ అసెంబ్లీ ప్ర‌త్యేకంగా స‌మావేశంలో ఏపీ రాజ‌ధానిగా అమ‌రావ‌తి ని గుర్తించాల‌ని అసెంబ్లీ తీర్మానం చేసే అవ‌కాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *