NewsInn

News in a Click

ఖైరతాబాద్ ఉప ఎన్నికపై బండి సంజయ్ హాట్ కామెంట్స్

ఖైరతాబాద్ ఉప ఎన్నికపై బండి సంజయ్ హాట్ కామెంట్స్

(న్యూస్ఇన్‌, క‌రీంన‌గ‌ర్)

ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక పై కేంద్ర మంత్రి బండి సంజ‌య్ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. ఈ ఉప ఎన్నిక‌ల్లో పోటీ బీజేపీ, బీఆర్ ఎస్ మ‌ధ్యే ఉంటుంద‌ని వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నిక త‌ప్ప‌ద‌న్న అంచ‌నాతో రాజకీయాల్లో మాటల యుద్ధం మొదలైంది. ఉప ఎన్నికను ఎదుర్కొనే దమ్ము కాంగ్రెస్‌కు లేదని ఆయన విమర్శించారు. ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్‌ను రాజకీయంగా ఓడిస్తామని వ్యాఖ్యానించారు.

తెలంగాణ హైకోర్టు దానం నాగేందర్‌ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించడంతో ఉప ఎన్నికపై చర్చ మొదలైంది. దానం నాగేందర్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయ‌డంతో దీనిపై ఇంకా ఉత్కంఠ మొద‌లైంది. సుప్రీం కోర్టు ఎలాంటి నిర్ణ‌యం వెల్ల‌డిస్తుందో అన్న‌ది ఆస‌క్తి రేపుతున్న అంశంగా మారింది.

గ‌త ప్ర‌భుత్వం భూదోపిడి చేసింద‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న చేయ‌డంతో ఆ అక్ర‌మ భూముల‌ను ప్ర‌భుత్వం వెంట‌నే స్వాధీనం చేసుకోవాల‌ని, వాటికి సంబంధించిన ఆధారాలు బ‌య‌ట‌పెట్టి క్రిమిన‌ల్ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేత‌లు ప్రైవేటు వ్య‌క్తుల భూముల్లోకి వెళ్లడానికి ప్ర‌త్య‌క అనుమ‌తులు ఏమైనా పొందారా అని నిల‌దీశారు. 22ఏ కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అవసరమైతే ఈ అంశంపై న్యాయపోరాటం చేస్తామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ తమకు రాజకీయ ప్రత్యర్థి కాదని, బీజేపీ-బీఆర్ఎస్ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *