(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ ఇన్)
వర్షం అంతరాయంతో ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్ లో రాయల్ చాలెంజర్జ్ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 193 పరుగులు చేసింది. 194 పరుగుల విజయ లక్ష్యంగా బరిలో దిగిన ఆర్సీబీ కేకేఆర్ బౌలర్లను ఆడుతూ పాడుతూ ఎదుర్కుంటూ విజయం సాధించింది. కేకేఆర్ ఫీల్డర్లు జార విడిచిన క్యాచ్ లను ఆర్సీబీ సద్వినియోగం చేసుకుంది. విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లో కూడా ఛేజింగ్ లో మారోసారి తన సత్తా చాటుకున్నారు.విరాట్ కోహ్లీ చేసింగ్ లో మరోసారి సెంచరీ సాధించారు. విరాట్ క్రీజులో ఉండడంతో ఆర్సీబీ మ్యాచ్ పై పూర్తి స్థాయిలో పట్టు భిగించింది.20వ ఓవర్ తొలి బంతికే కేకేఆర్ పై ఆర్ సీబీ విజయం సాధించింది.విరాట్ కోహ్లీ60 బాల్స్ ఎదుర్కొని 105 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. జితేష్ శర్మ 4 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. ఆర్సీబీ కూడా నాలుగు వికెట్లు కోల్పోయి విజయం దక్కించుకుంది.
విరాట్ స్పెషల్ ఇన్నింగ్స్….

గత రెండు మ్యాచ్ ల్లో పరుగులేమి చేయకుండా ఔటైన విరాట్ ఈ మ్యాచ్ లో రాణించారు.టీ-20 ల్లో 14 వేల పరుగుల మైలురాయిని ఈ మ్యాచ్ లో చేరుకున్నారు. తొలి వికెట్ భాగస్వామ్యానికి ఆర్సీబీ 3.2 ఓవర్లలో 37 పరుగులు చేసిన తరువాత జాకెబ్ బేథెల్ 15 పరుగులు చేసి ఔటయ్యారు. అప్పడు విరాట్ కు దేవదత్ పడిక్కల్ జత కట్టడంతో పరుగుల వేగం పుంజుకుంది. ఈ ఇద్దరు బ్యాటర్లు కేకేఆర్ బౌలర్లను సునాయసంగా ఎదుర్కొంటూ పరుగులు చేశారు. పడిక్కల్ 27 బాల్స్ ఎదుర్కొని 39 పరుగులు చేసి ఔటయ్యారు. 129 పరుగుల వద్ద బెంగుళూరు 2వ వికెట్ కోల్పోయింది. పాటిదార్ కూడా కోహ్లీకి సహాకారం అందిస్తూ భారీ షాట్ ఆడబోయి ఔటయ్యారు. పాటిదార్ కేవలం 11 మాత్రమే చేశారు.టీం డేవిడ్ రెండు పరుగులు మాత్రమే చేసి మనీష్ తివారి కళ్లు చెదిరే క్యాచ్ తో వెనుదిరిగారు. మనీష్ తివారి క్యాచ్ అందుకున్నట్లు కూడా టీం డేవిడ్ ఆశ్చర్య పోవాల్సి వచ్చింది. ఇక రిప్లై చూసిన తరువాత క్రీజు విడిచి పెవీలియన్ చేరుకున్నారు.
రఘువంశీ….

అంతకు ముందు బ్యాటింగ్ చేసిన కేకేఆర్ త్వర త్వరగానే కోల్పోయింది. దీంతో పరుగులు సాధించేందుకు ఒక దశలో కేకేఆర్ బ్యాటర్లు ఇబ్బందులు పడ్డారు. అజింక్యా రహనే 19 , ఫిన్ అలెన్ 18 పరుగులు చేసి వెనుదిరిగారు. ఆ తరువాత రఘువంశీ రాణించడంతో కేకేఆర్ భారీ స్కోరు చేయగలిగింది. రఘువంశీ 46 బంతులు మాత్రమే ఎదుర్కొని 71 పరుగులు చేసారు. 7 ఫోర్లు, 3 సిక్స్ లు ఈ స్కోరులో ఉన్నాయి. కెమరన్ గ్రీన్ క్రీజులో ఉన్నంత సేపు భారీగా పరుగులు చేశారు. 24 బంతులు ఎదుర్కొని 32 పరుగులు చేశారు. రింకూసింగ్ చివర్లో వచ్చి భారీగా పరుగులు సాధించారు. రింకూ కేవలం 29 బాల్స్ ఎదుర్కొని 9 ఫోర్లు, 2 సిక్స్ లతో 49 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. 20 ఓవర్లలో కేకేఆర్ 4 వికెట్లు కోల్పోయి 192 పరుగుల చేసింది.
మంగళవారం నాటి మ్యాచ్ లో సన్ రైజర్స్ ను గుజరాత్ టైటన్స్ చిత్తు చేసింది.












Leave a Reply