(స్పోర్ట్స్ డెస్క్, న్యూస్ఇన్)
ఐపీఎల్ లో కీలక మ్యాచ్ గా అందరిలో ఉత్కంఠ రేపిన సన్ రైజర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగెళూరు మ్యాచ్ ఎస్ ఆర్ హెచ్ ఘన విజయం దక్కించుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఎస్ ఆర్ హెచ్ 256 పరుగుల విజయ లక్ష్యాన్ని బెంగుళూరు ముందు ఉంచింది. ఈ లక్ష్యం ఛేధించేందుకు జట్టు ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. భారీ స్కోరు కావడంతో తొలి ఓవర్ నుంచే పరుగులు పెద్ద ఎత్తున రాబట్టే యత్నం చేశారు. మంచి ఆరంభం దక్కినా….ఓపెనర్లు వెనుకదిరగడంతో ఆ జట్టు బ్యాటర్లు విజయం కోసం కాకుండా మ్యాచ్ పూర్తి చేయాలన్న లక్ష్యంగా ఆటను ముగించారు. ఈ సీజన్లో బాగా రాణిస్తున్న వెంకటేశ్ అయ్యార్ ఈ మ్యాచ్ లో హైదరాబాద్ బౌలర్లపై విరుచుకు పడ్డారు. 19 బంతులు మాత్రమే ఎదుర్కొని 4 సిక్స్ లు, 4 ఫోర్లతో 44 పరుగులు చేసి ఔటయ్యరు. తొలి వికెట్ ను ఆర్సీబీ 5వ ఓవర్లో కోల్పోయింది. ఆ తరువాతి ఓవర్లోనే విరాట్ కొహ్లీ కూడా ఔటయ్యారు. కింగ్ కోహ్లీ ఆడుతున్న మ్యాచ్ చూసేందుకు వచ్చిన అభిమాను లకు ఈ మ్యాచ్ లో నిరాషే ఎదురైంది. కేవలం 15 పరుగులు మాత్రమే చేసి పెవీలియన్ చేరుకున్నారు. ఇద్దరు ఓపెనర్లు త్వరత్వరగా ఔట్ కావడంతో జట్టు స్కోరు మందగించింది. లక్ష్యం ఛేధించేందుకు భారీగా పరుగులు రాబాట్లాల్సిన పరిస్థితి ఈ వత్తిడిలో బెంగుళూరు బౌలర్లను భారీ షాట్లు ఆడకుండా సన్ రైజర్స్ బౌలర్లు అడ్డుకోవడంలో విజయవంతం అయ్యారు.

ఫాంలో ఉన్న పడిక్కల్ కూడా ఈ మ్యాచ్ లో త్వరగానే ఔటయ్యారు. 14 బాల్స్ ఎదుర్కొన్న పడిక్కల్ 21 పరుగులు చేసి వెనుదిరిగారు. కెప్టన్ రజత్ పాటిదార్, పడిక్కల్ కీలక భాగస్వామ్యం అందిస్తారని అంచనా వేసినా అది సాధ్యం కాలేదు. క్రీజులో నిలదొక్కుకున్న టార్గెట్ ఛేధించడంలో వెనుక బడిపోయారు. విజయం సాధించేందుకు అవసరమైన రన్ రేట్ ప్రతి ఓవర్ కు పెరుగుతూ వస్తుంండంతో బెంగుళూరు బ్యాటర్లు ఆ రన్ రేట్ సాధించలేకపోయారు. పడిక్కల్- కృనాల్ లు కలిసి మంచి భాగస్వామ్యం జట్టుకు అందించారు. రజత్ పాటిదార్ ట్రావిస్ హెడ్ బౌలింగ్ లో 56 పరుగులు చేసి ఔట్ ఆయ్యారు. కృనాల్ పాండ్య 41 పరుగులతో టీం డేవిడ్ 15 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. రాయల్ ఛాలెంజర్స్ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 200 పరుగులు మాత్రమే చేయగలిగింది.దీంతో సన్ రైజర్స్ 55 పరుగుల తేడాతో బెంగుళూరు పై ఎస్ ఆర్ హెచ్ విజయం దక్కించుకుంది.







Leave a Reply