–హౌసింగ్ బోర్డుకు రూ.47.14 కోట్ల ఆదాయం
(న్యూస్ఇన్,హైదరాబాద్)
కూకట్పల్లి హౌసింగ్ బోర్డు (కేపీహెచ్బీ) కాలనీలోని ఓపెన్ ప్లాట్లకు మరోసారి రికార్డు ధర పలికింది. హైదరాబాద్లో అత్యంత డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో ఒకటైన కేపీహెచ్బీ 7వ ఫేజ్లో హౌసింగ్ బోర్డు నిర్వహించిన బహిరంగ వేలంలో చదరపు గజం భూమి గరిష్ఠంగా రూ.2.70 లక్షలకు విక్రయమైంది.
కేపీహెచ్బీ 7వ ఫేజ్లోని 16 ఎంఐజీ ఓపెన్ ప్లాట్లకు బుధవారం బహిరంగ వేలం నిర్వహించారు. వేలం కోసం హౌసింగ్ బోర్డు ఆగస్టు 10న నోటిఫికేషన్ విడుదల చేసింది. చదరపు గజానికి కనీస ధరను రూ.1.60 లక్షలుగా నిర్ణయించగా, గరిష్ఠంగా రూ.2.70 లక్షల వరకు బిడ్డింగ్ జరిగింది.
ఒక ప్లాట్ చదరపు గజం రూ.2.70 లక్షలకు, మరో ప్లాట్ రూ.2.36 లక్షలకు అమ్ముడయ్యాయి. మరో రెండు ప్లాట్లు చదరపు గజం రూ.2.06 లక్షల చొప్పున ధర పలికాయి.వేలం ప్రక్రియలో మొత్తం 19 మంది బిడ్డర్లు పాల్గొని తమకు నచ్చిన ప్లాట్ల కోసం పోటీ పడ్డారు. పూర్తి పారదర్శకంగా నిర్వహించిన ఈ బహిరంగ వేలంలో చదరపు గజం భూమికి సగటున సుమారు రూ.1.79 లక్షల ధర లభించినట్లు హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ వి.పీ. గౌతం తెలిపారు.
కేపీహెచ్బీ ప్రాంతం అన్ని మౌలిక వసతులతో అభివృద్ధి చెంది ఉండటంతో పాటు, ఎటువంటి వివాదాలు లేని భూములు కావడం, ప్రాంతానికి ఉన్న డిమాండ్ కారణంగా ప్లాట్లకు భారీ ధరలు లభించాయని అధికారులు తెలిపారు.ఈ బహిరంగ వేలం ద్వారా హౌసింగ్ బోర్డుకు సుమారు రూ.47.14 కోట్ల ఆదాయం సమకూరినట్లు వైస్ ఛైర్మన్ వి.పీ. గౌతం వెల్లడించారు.












Leave a Reply