NewsInn

News in a Click

ఇందిరమ్మ లబ్ధిదారులకు వారంలో కేటాయింపు

ఇందిరమ్మ లబ్ధిదారులకు వారంలో కేటాయింపు

(న్యూస్ఇన్‌,హైదరాబాద్)

ఇందిర‌మ్మ ట‌వ‌ర్స్ ల‌బ్దిదారుల ఎంపిక పూర్తి కావ‌డంతో వారం రోజుల్లోనే కేటాయింపు ప‌త్రాల‌ను ఇచ్చేందుకు స‌ర్కార్ రెడీ అవుతోంది. LIG గృహాల లక్కీ డ్రా ద్వారా మొత్తం 7,340 మంది అభ్యర్థులు ఎంపికయ్యారని, వారిలో ఇప్పటివరకు 6,643 మంది అభ్యర్థుల క్షేత్రస్థాయి పరిశీలన పూర్తికాగా, 5,521 మంది అర్హులుగా నిర్ధారించామ‌ని హౌసింగ్ వీసీ, క‌మిష‌న‌ర్ గౌతం తెలిపారు.

మిగిలిన వారి ఎంపిక‌పై క్షేత్రస్థాయి పరిశీలనను ఈ వారంలోనే పూర్తి చేస్తామన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులుగా నిర్ధారించబడిన లబ్ధిదారులకు అధికారిక కేటాయింపు పత్రాలు జారీ చేస్తామని తెలిపారు.

లక్కీ డ్రాలో ఎంపికైన అభ్యర్థులు తమకు ఇల్లు కేటాయించబడుతుందా లేదా అనే ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన మరియు అర్హత నిర్ధారణ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా కొనసాగుతోందని స్పష్టం చేశారు.

ఈ ప్రక్రియను ఆసరాగా చేసుకుని మధ్యవర్తులు ఇల్లు మంజూరు చేయిస్తామని లేదా అధికారులతో మాట్లాడి సహాయం చేస్తామని చెబుతూ అమాయక లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ల‌బ్దిదారుల ఎంపిక‌లో ప్రభుత్వ నిబంధనలు, నిర్దేశించిన అర్హతలు మరియు అధికారిక ప్రక్రియ ఆధారంగానే జరుగుతుందని బ్రోక‌ర్ల‌ను న‌మ్మి పోస‌వ‌ద్ద‌ని సూచించారు.ల‌బ్దిదారులు మొదటి విడత మొత్తాన్ని చెల్లించాల్సిన అధికారిక బ్యాంకు ఖాతా వివరాలు, చెల్లించాల్సిన మొత్తం, చెల్లింపు గడువు మరియు ఇతర సూచనలను కేటాయింపు పత్రంతోపాటే అధికారికంగా తెలియజేస్తామన్నారు.గృహాల కేటాయింపు, క్షేత్రస్థాయి పరిశీలన, కేటాయింపు పత్రాలు, మొదటి విడత చెల్లింపు తదితర అధికారిక సమాచారం కోసం తెలంగాణ హౌసింగ్ బోర్డు వెబ్‌సైట్ tghb.telangana.gov.in సందర్శించవచ్చు లేదా కాల్‌ సెంటర్ నంబరు 040-24603572ను సంప్రదించవచ్చని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *