NewsInn

News in a Click

టీమ్ వర్క్… బెటర్ రిజల్ట్స్…అభివృద్ధి మంత్రం

టీమ్ వర్క్… బెటర్ రిజల్ట్స్…అభివృద్ధి మంత్రం

2026లోనూ పెట్టుబడుల ఫ్లో ఏపీ వైపే ఉండాలి

సూర్యలంక బీచ్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్

సీఎం చంద్రబాబు

(అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌)

ఏపీలో ప్ర‌భుత్వం అనుస‌రించిన ముదు చూపుతో ప్ర‌ముఖ సంస్థ‌లు పెట్టుబ‌డులో పెట్టేందుకు ముందుకు వ‌చ్చాయ‌ని ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు చెప్పారు. ప్ర‌భుత్వ చొర‌వ‌తో గూగుల్, టాటా, జిందాల్, బిర్లా, అదానీ, రిలయన్స్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ప్రముఖ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టాయన్నారు. ఏ చిన్న పొరపాటుకు తావివ్వకుండా మంత్రులు, అధికారులు బాధ్యత తీసుకోవాలి.”అని సీఎం చంద్రబాబు చెప్పారు.2025లో రాష్ట్రం కోసం అందరూ అద్భుతంగా పని చేశారు. గత ప్రభుత్వ పాలనలో పోయిన బ్రాండ్ ఇమేజ్ రాష్ట్రానికి తిరిగి వచ్చి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. భారీ పరిశ్రమలు ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాయి. రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 14వ ఎస్ఐపీబీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వివిధ ప్రాజెక్టులకు రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రొత్సాహక బోర్డు ఆమోదం తెలిపింది. పరిశ్రమలు, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన రంగాల్లో వివిధ పెట్టుబడులను 14వ ఎస్ఐపీబీ సమావేశం ఆమోదించింది. 14వ ఎస్ఐపీబీ సమావేశంలో మొత్తంగా 14 సంస్థలకు చెందిన రూ.19,391 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. వీటి ద్వారా 11,753 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. దీంతో ఇప్పటి వరకు రూ.8,74,705 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించగా, 8,35,675 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఎస్ఐపీబీ సమావేశం ప్రారంభం కాగానే మంత్రులు, సీఎస్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

ప్రజలపై భారాన్ని తగ్గించగలిగాం….

“విద్యుత్ రంగంలో అద్భుతంగా పనిచేశాం. 13 పైసలు విద్యుత్ ఛార్జీలు తగ్గించాం. రూ.4500 కోట్ల ట్రూఅప్ ఛార్జీల భారాన్ని ప్రజలపై వేయకుండా ప్రభుత్వమే భరించాలని నిర్ణయించాం. విద్యుత్ కొనుగోళ్ల ధరలను కూడా తగ్గించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. 2029 నాటికి విద్యుత్ కొనుగోలు ధరను రూ. 3.70కు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడకుండా చూడడం నాకు చాలా సంతోషాన్నిచ్చిందని వ్యాఖ్యానంచారు.

ఐ ల్యాండ్ టూరిజం పై ఫోకస్……

సూర్యలంక అత్యంత సురక్షితమైన బీచ్ ప్రాంతం. బీచ్ టూరిజంపై మాస్టర్ ప్లాన్ తయారు చేయాల‌ని చంద్ర‌బాబు ఆదేశించారు. సూర్యలంక బీచ్ ఫ్రంట్ అభివృద్ధి చేయాలి. 15 కిలోమీటర్ల మేర క్లీన్ బీచ్ ఫ్రంట్ ఉండాలి. కాలుష్య రహిత ప్రాంతంగా సూర్యలంక బీచ్ ఫ్రంట్ ఉండాలి. సూర్యలంకతో పాటు సూళ్లూరు పేట వద్ద ఉన్న చిన్ని చిన్న ద్వీపాలను కూడా బీచ్ టూరిజం కింద అభివృద్ధి చేయవచ్చు. మాల్దీవ్స్ తరహాలో ఐ ల్యాండ్ టూరిజం తయారు చేసుకోవాలి. 25 వేల గదులు నిర్మించగలిగితే పర్యాటకుల్ని ఆకర్షించవచ్చు. టూరిజం కార్పోరేషన్ మరింత బలోపేతం కావాలి. సూర్యలంక ఏపీటీడీసీ రేటింగ్ పెరగాల్సిన అవసరం ఉంది. రాబోయే 15 ఏళ్లలో వెయ్యి కోట్ల ఆదాయం టూరిజం కార్పోరేషన్ కు వచ్చేలా ప్రణాళికలు సిద్దం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. రాష్ట్రంలోని ఇత‌ర టూరిజంప్రాంతాలపైనా దృష్టి పెట్టాల‌న్నారు.

ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లతో రైతులకు మేలు….

ఫుడ్ ప్రాసెసింగ్ ఉత్పత్తులు ఏపీ నుంచి గ్లోబల్ మార్కెట్లకు వెళ్లాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సీఎం చంద్ర‌బాబు అభిప్రాయాన్నివ్య‌క్తం చేశారు. వాల్యూ అడిషన్ జరిగితేనే రైతులకు గరిష్ట ప్రయోజనం దక్కుతుంది. ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థలతో సమావేశం ఏర్పాటు చేయండి. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఏపీ ఛాంపియన్ కావాలి. ప్రస్తుతం రైతులు ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. భవిష్యత్తులో ఉద్యాన ఉత్పత్తులు పెద్ద ఎత్తున పండే అవకాశం ఉంది. దానికి అనుగుణంగా ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు కావాలి. పాలసీల అమలు విషయంలో ఎలాంటి డీవియేషన్ ఉండేందుకు వీల్లేదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *