బెంగాల్ లో బీజెపిదే విజయం
వైరల్ అవుతున్న వీడియో
(హైదరాబాద్,న్యూస్ఇన్)
ఆమెరికాకు చివరి అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ అవుతారని , ఆ తరువాత ఆమెరికా విఛ్చినం అవుతుంని ఓ జ్యోతిష్కురాలు జోస్యం చెబుతున్నారు. సోవియట్ యూనియన్ మాదిరిగానే ఆమెరికా కూడా విడిపోతుందని స్పస్టం చేశారు. ఆమెరికాకు ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న డోనాల్డ్ చివరి అధ్యక్షుడిగా నిలిచిపోతారన్నారు. ఎన్నో కీలక విషయాలు ఉన్నా…. ఐదు అత్యంత ప్రాధాన్యత ఉన్న ఉన్న ఐదు అంశాలను మాత్రమే వెల్లడిస్తున్నానని చెప్పారు. 2027 జూలై కు ముందే ఈ ప్రక్రియ జరిగిపోతుందన్నారు. ప్రధాని మోడీ చొరవతో యూఎన్ సెక్యురిటీ కౌన్సిల్ భారత దేశానికి 2027 లో ప్రాతినిథ్యం దక్కుతుందని చెప్పారు. ప్రస్తుతం ఐదు దేశాలున్న విటో పవర్ లో భారత దేశం ఆరో దేశంగా చేరుతుందన్నారు.
జాతీయ రాజకీయాలపై స్పందిస్తూ….ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఐదేళ్ల పదవీ కాలన్ని పూర్తి చేయడం సాధ్యం కాదన్నారు. రాజకీయ కారణాలు కావచ్చు లేదంటే ఆనారోగ్య కారణాలతో ఆమె తన పదవికి రాజీనామా చేస్తారని జ్యోతిష్కురాలు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్ లా మమత బెనర్జీకి చివరి ఎన్నికలు అవుతాయన్నారు. మమతకు ఇవే చివరి ఎన్నికలని తేల్చి చెప్పారు. ఈ ఎన్నికల తరువాత ఆమె ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేనే లేదన్నారు. బీహార్ లో ఎన్నికల్లో బీజెపి విజయం సాధిస్తుందనీ చెప్పారు. దీన్ని బట్టిచూస్తే ఈ వీడియో బీహార్ ఎన్నికలకు ముందు చేసిన వీడియో గా తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీహార్ లో బీజెపి తన మిత్ర పక్షమైన జెడీయూ పార్టీతో కలిసి అధికారం చేజిక్కించుకుంది.
ఈమె చెప్పిన జ్యోతిష్యంలో 97 శాతం నిజమయ్యాయని పలువురు నెటిజన్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో చోటు చేసుకునే సంఘటనకు సంబంధించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఎంత వరకు నిజం అవుతాయో అన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.





Leave a Reply