
(న్యూఢిల్లీ,న్యూస్ఇన్)
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం చెందారు. బారామతిలో ఆయన ప్రయాణిస్తున్న ఫ్లైట్ క్రాష్ కావడంతో విమానం పూర్తిగా మంటల్లో అగ్నికి ఆహుతి అయింది. విమానంలో ఎవరెవరు ప్రయాణిస్తున్నారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అజిత్ కుమార్ తో పాటు మరో ఆరుగురు ఈ ప్రమాదంలో మృతి చెందినట్లు డీజీసీఏ అధికారులు వెల్లడించారు. మహారాష్ట్రలో జరుగుతున్న జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారానికి బయలుదేరుతున్న సమయంలోనే విమాన ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు తెలిపారు






Leave a Reply