- ఎమ్మెల్యే రోహిత పవార్
(న్యూఢిల్లీ, న్యూస్ఇన్)

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎన్సీపీ నేత అజీత్ పవార్ విమాన ప్రమాదం జరిగి గత నెలలో దుర్మరణం చెందారు. బారమతిలో జరిగిన ఈ ప్రమాదంలో అజీత్ పవార్ తో మారో నలుగురు కూడా మృత్యువాత పడ్డారు. మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న అజీత్ పవార్ మృతిపై అప్పటి నుంచి అనుమానాలు పలు రాజకీయ పార్టీల నేతలు వ్యక్తంచేస్తున్నారు. శివసేన ఉద్దవ్ ఠాక్రే వర్గం నేత సంజయ్ రౌత్ అజీత్ మృతి వెనుక భారీ కుట్ర ఉందన్న ఆరోపణలు తెరపైకి తెచ్చారు. మహారాష్ట్రలో జరుగుతున్న కుంభకోణానాన్ని బయటపెడుతా అని అజీత్ వ్యాఖ్యలు చేసినందుకే కుట్ర జరిగిందన్న అనుమానాలు ఆయన వ్యక్తం చేశారు. తెలంగాణాకు చెందిన బీజేపీ నుంచి సస్పెన్షన్ కు గురైన ఎమ్మెల్యే రాజాసింగ్ అజీత్ పవార్ విమాన ప్రమాదంపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అన్న అభి ప్రాయం వ్యక్తం చేశారు. తాజాగా పవార్ కుటుంబానికి చెందిన మరో రాజకీయ నేత రోహిత పవార్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది విమాన ప్రమాదం అనే కంటే కుట్రగా భావిస్తున్నట్లు చెప్పారు.

కెప్టన్ సుమీత్ కపూర్ పైలెట్ గా అనుభవం ఆయన వ్యవహారంపై ఆరా తీయాల్సిన అవసరం ఉందన్నారు.పైలెట్ మద్యం సేవించి ఉన్నందుకు గతంలో 3 సంవత్సరాలు సస్పెన్షన్ కు గురైన అంశాన్ని ప్రస్తావించారు. విమాన ప్రమాద సమయంలో జరిగిన కాల్ రికార్డులను బయటపెట్టాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. ప్రైవేటు జెట్ లో కూడా సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు నిర్వహణ రికార్డులు సక్రమంగా లేకపోవడం వంటి అంశాలను ఎమ్మెల్యే రోహిత్ పవార్ అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర విచారణకు స్వతంత్ర దర్యాప్తు సంస్థలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.




Leave a Reply