NewsInn

News in a Click

భార‌త్ కు హ‌ర్ముజ్ జ‌ల‌సంధిలో గ్రీన్ సిగ్న‌ల్

ముంబాయి చేరుకున్న తొలి క్రూడ్ అయిల్ నౌక‌

(న్యూఢిల్లీ, న్యూస్ఇన్‌)

ఇరాన్- ఆమెరికా, ఇజ్రాయిల్ యుద్ధం నేప‌థ్యంలో గ‌త 13 రోజులుగా ఎన్నో దేశాలు చ‌మురు స‌ర‌ఫ‌రా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప‌లు దేశాలు ఇప్ప‌టికే చ‌మురు వినియోగంపై ఆంక్ష‌లు విధిస్తున్నాయి. అత్య‌ధిక చ‌మురు వినియోగం ఉన్న భార‌త్ లాంటి దేశాల‌ను ఈ స‌మ‌స్య చుట్టుముడితే ప్ర‌భుత్వాలు కూడా ఏమి చేయ‌లేని ప‌రిస్తితి ఉంటుంది. ప‌శ్చిమాసియా యుద్ధం కార‌ణంగా హ‌ర్మూజ్ జ‌ల సంధిలో జ‌ల‌మార్గంలో కీల‌కం. ఈ మార్గంలో చ‌మురు ర‌వాణా నౌక‌లు వ‌స్తే పేల్చేస్తామ‌ని ఇరాన్ హెచ్చ‌రించింది. స‌ముద్ర మార్గంలో 30 కిలోమీట‌ర్ల ఈ జ‌ల‌మార్గాన్ని మూసి వేయ‌డంతో పెట్రోల్, డీజిల్ కొర‌త మొద‌ల‌య్యాయి. కానీ ఈ మార్గంలో భార‌త్ కు సౌదీ అరేబియా నుంచి క్రూడ్ అయిల్ ఈ జ‌ల‌మార్గం గుండా ముంబాయికి చేరుకుంది. యుద్ధం మొద‌లై 13 రోజుల తరువాత తొలి నౌక భార‌త్ చేరుకోవ‌డంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

ప‌శ్చిమాసియా యుద్ధ స‌మ‌యంలో ఇరాన్ తో భార‌త దేశం చేసిన దౌత్యం ఫ‌లించ‌డంతో దేశంలో ఇక చ‌మురు స‌మ‌స్య‌ల‌కు పులిస్టాప్ ప‌డ్డ‌ట్లే.

ఈ యుద్దాన్ని ఆపే ప్ర‌య‌త్నంలో కేఏ పాల్ ఆమెరికాలో ప‌ర్య‌టిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *