(హైదరాబాద్,న్యూస్ఇన్)
కేంద్ర మంత్రి తనయుడు బండి భగీరథ పై నమోదైన కేసు రాజకీయంగా దూమారం రేపుతుండడంతో పోలీసులు ఆలస్యంగా స్పందించారు. ప్రధాని పర్యటన కారణంగా జాప్యం జరిగిందని పోలీసులు సర్ది చెప్పుకునే యత్నం చేస్తున్నారు. 8వ తేదీన బాధితురాలు బండి భగీరథపై ఫిర్యాదు చేస్తే ప్రధాని పర్యటన పూర్తయిన తరువాత సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోనంత వరకు పోలీసులు పెద్దగా స్పందించలేదు. సీఎం డీజీపీపై సీరియస్ కావడంతో పోలీసు శాఖ ఇప్పుడు వేగంగా స్పందిస్తోంది. ఈ కేసు విచారించేందుకు ప్రభుత్వం సిట్ ను నియమించింది. సిట్ ఇంచార్జ్ గా మహిళా అధికారి రితిరాజ్ గైక్వాడ్ ను నియమించింది. ఈ అధికారి కేసు ను అధ్యయనం చేయడంలో తలమునకలయ్యారు. కేసులో గతంలో పోలీసులు నమోదు చేసిన స్టేట్ మెంట్ లను పరిశీలించారు. మరుసటి రోజు పోలీసులు స్పందించి బండి భగీరథకు నోటీసులు అందించారు. 13వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు పేట్ బషీరాబాద్ పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

ముందస్తు బేయిల్….
మరో వైపు బండి భగీరథ కూడా ముందస్తు బేయిల్ ప్రయత్నాల్లో కోర్టును ఆశ్రయించారు. పోలీసులు అరెస్టు చేయకుండా బేయిల్ దక్కించుకునే యత్నాలు మొదలు పెట్టారు. ప్రముఖ న్యాయ వాది నిరంజన్ రెడ్డి భగీరథ కేసును వాదించనున్నట్లు తెలుస్తోంది. వేసవి సెలవులు కావడంతో ఈ నెల 14వ తేదీన ఈ కేసు కోర్టులో విచారణకు రానున్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో గురువారం బండి భగీరథ విచారణకు హాజరవుతారా లేదా అన్నది ఆసక్తి రేపుతోంది.
సంజయ్ సంచలన వ్యాఖ్యలు…..
ఇదే సమయంలో మంత్రి బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. భగీరథ తప్పు చెస్తే శిక్ష అనుభవిస్తారని చెబుతూనే…. నన్ను కుట్రలో ఇరికించిన వారిని దహించి వేస్తానని వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ వ్యాఖ్యలు సొంత పార్టీ నేతలను ఉద్దేశించి చేశారా…లేదంటే విపక్ష పార్టీల నేతలను ఉద్దేశించి చేశారా అన్నది ఆసక్తి రేపుతోంది. బండి చేసిన వ్యాఖ్యలు చూస్తే భగీరథ అరెస్టు తప్పదన్న సంకేతాలు సంజయ్ కు అందినట్లే కనిపిస్తోంది. ఆ కారణంగానే తప్పు చేస్తే శిక్ష అనుభవిస్తారని వ్యాఖ్యలు చేసినట్లు సమచారం. అయితే కోర్టులు ఈ విషయాన్ని తేలుస్తాయని చెప్పడం కూడా ఈ ఘటనను కోర్టులోనే తాము తేల్చుకునేందుకు సిద్ధం అనే సంకేతాలు కూడా బండి సంజయ్ ఇచ్చారు.











Leave a Reply