(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ ఇన్)
ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్ లో సన్ రైజర్స్
హైదరాబాద్ వత్తిడి తో చిత్తయింది. రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఎంతో ఉత్కంఠ రేపినా… చివరికి ఏకపక్షంగా ముగిసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్,సన్ రైజర్స్ ముందు 244 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కీలక మ్యాచ్ లో ఓటమితో ఈ ఏడాది ఐపిఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ ముగిసింది.హైదరాబాద్ జట్టు పవర్ ప్లే వరకు పరవాలేదు అనిపించే విధంగా హైదరాబాద్ బ్యాటర్లు బ్యాటింగ్ చేశారు. భారీ స్కోరు చేదనలో … హైదరాబాద్ బ్యాటర్ అభిషేక్ శర్మ పైనే అందరి ధీమా…..కానీ అభిషేక్ ఈ మ్యాచ్లో పరుగుల ఖాత ప్రారంభించకుండానే వెను దిరిగారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్ లు భారీ షాట్లతో కొద్దిసేపు మ్యాచ్ ను ఉత్కంఠ భరితంగా మార్చారు. ఇషాన్ భారీ షాట్లు ఆడుతూ క్రీజులో కుదురుకున్నట్టు కనిపించినా …. ఆర్చర్ బౌలింగ్ లో భారీ షాట్ ఆడేందుకు వెళ్లి క్యాచ్ అవుట్ అయ్యారు. ఆ తర్వాత మరో ఓపెనర్ ట్రాఫిక్ హెడ్ బౌల్డ్ అయ్యారు. దీంతో సన్ రైజర్స్ జట్టు గెలుపు పై ఆశలు వదులుకున్నట్లు అయ్యింది.

పవర్ ప్లే లోపే కేవలం 69 చేసి నాలుగు కీలక వికెట్ కోల్పోవడంతో హైదరాబాద్ జట్టు కష్టాల్లో పడింది. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లలో నితీష్ కుమార్ రెడ్డి మినహా మిగిలిన వారు పెద్దగా పరుగులు చేయకుండానే వెను దిరి గారు. రన్ రేట్ తగ్గకుండా హైదరాబాద్ బ్యాటింగ్ చేసినా వరుసగా వికెట్లు పడిపోతుండడంతో చిక్కుల్లో పడింది. 13వ ఓవర్ నాటికి 7 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. 7 ఓవర్లలో విజయం కోసం 96 పరుగులు చేయాల్సి వచ్చింది. రాజస్థాన్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ మూడు కీలక వికెట్లు పడగొట్టి హైదరాబాద్ పతనాన్ని పవర్ ప్లే లో శాసించారు.

రవీంద్ర జడేజా రెండు, మిగిలిన బౌలర్లు తమ వంతు సహకారం అందించడంతో హైదరాబాద్ పై రాజస్థాన్ సునాయాసంగా విజయం సాధించింది. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టులో… చిచ్చరపిడుగు వైభవ్ సూర్య వంశీ ఇన్నింగ్స్ కారణంగానే భారీ స్కోరుకు బాటలు వేసుకుంది.
హైదరాబాద్ జట్టు తరుపున నితీష్ కుమార్ రెడ్డి చేసిన 39 పరుగులే అత్యధిక స్కోరు కావడం విశేషం. హైదరాబాద్ స్టార్ బ్యాట్స్మెన్లు మొత్తం కీలక మ్యాచ్ లో రాణించకపోవడంతో ఓటమిని తప్పించుకోలేకపోయింది. చివరి 2 ఓవర్ల లో 50 కి పైగా పరుగులు చేయాల్సి ఉన్నా….కీలక బ్యాటర్లు పెవిలియన్ చేరుకోవడంతో టైల్ ఎండర్ల ఆల్ అవుట్ కాకుండా సృష్టి సాధించినట్లు కనిపించింది.196 పరుగులకు 19.2 ఓవర్ల కు హైదరాబాద్ ఆల్ అవుట్ కావడంతో… రాజస్థాన్ విజయం లాంచనం అయింది.












Leave a Reply