(బెంగుళూరు,న్యూస్ఇన్)
కన్నడ రాజకీయాల్లో కొత్త శకం మొదలుకానుంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న డీకే శివకుమార్ ను ముఖ్యమంత్రి పదవి వరించింది. సిద్దు ఇమేజ్… డీకే ప్రయత్నాలతో అధికారంలోకి కర్ణాటకలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇద్దరు నేతలకు సంబంధిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చింది. అందులో భాగంగా రెండున్నర ఏళ్ల పాటు ఒక్కొక్కరు సీఎం గా ఉండాలని పార్టీ హై కమాండ్ సిద్ది రామయ్యలు సీఎంగా ఎంపిక చేసినప్పుడే నిర్ణయం తీసుకుంది.సిద్దు రెండేళ్ల కాల పరిమితి పూర్తయిన వెంటనే డీకే శివకుమార్ కాంగ్రెస్ హై కమాండ్ పై ఒత్తిడి పెంచడం మొదలుపెట్టారు. కానీ సిద్ధి రామయ్య కూడా అదే స్థాయిలో పదవి విడరాదన్న అభిప్రాయంతో పావుల కదిపారు. సగం కాలం పూర్తయినా సిద్దు సీటు వదిలేందుకు పట్టు బట్టడంతో … కాంగ్రెస్ పార్టీ ఈ వ్యవహారాన్ని పార్టీకి ఇబ్బందులు కలగకుండా ఆపరేషన్ పూర్తి చేయాలన్న లక్ష్యంగా పావులు కదిపింది. సమయం చికినప్పుడల్లా డీకే హై కమాండ్ ను తన పదవి విషయంలో గుర్తు చేస్తూ వస్తున్నారు.

సరైన సమయం కోసం ఎదురుచూస్తూ వస్తున్న కాంగ్రెస్… ఇద్దరు కీలక నేతలను ఢిల్లీ రప్పించి ఒప్పించింది. జాతీయ రాజకీయాల్లో సిద్దుకు ప్రాతినిధ్యం కల్పిస్తామని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. పార్టీలో ఎక్కడ అసంతృప్తి జ్వాలలు లేవకుండా సైలెంట్ గా ఆపరేషన్ పూర్తి చేసింది. అందులో భాగంగా ఈరోజు ఉదయం సీఎం సిద్ధి రామయ్య మంత్రివర్గం సభ్యులతో బ్రేక్ ఫాస్ట్ చేసి రాజీనామా అంశాన్ని వెల్లడించారు. ఇప్పటివరకు సహకరించిన మంత్రులకు ధన్య వ్యాధాలు తెలిపారు. కాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్…. రాజకీయాల్లో సీనియర్ అయిన సిద్ధి రామయ్య ఆశీస్సులు తీసుకున్నారు.

ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రెండేళ్ల పాటు ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ కొనసాగనున్నారు. ముఖ్యమంత్రిగా రాజీనామా చేసేందుకు సిద్ధి రామయ్య గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు. సిద్దిరామయ్య రాజీనామా అనంతరం మొత్తం ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. శివ కుమార్ వర్గానికి చెందిన నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. అభిమానులు శివకుమార్ కార్యాలయం దగ్గర స్వీట్ లు పంచుకున్నారు.











Leave a Reply