NewsInn

News in a Click

ఫోక్సో కేసు – ఆరు హ‌త్య‌లు- చోద్యం చూసిన పోలీసులు

ఫోక్సో కేసు – ఆరు హ‌త్య‌లు- చోద్యం చూసిన పోలీసులు

(హైద‌రాబాద్, న్యూస్ఇన్‌)

రాష్ట్రంలో క‌ల‌క‌లం సఋష్టించిన ఆరు హ‌త్య‌ల కేసుల పోలీసుల వ్య‌వ‌హారంపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్ల‌వెత్తుతున్నాయి. నిందితుడిగా అనుమానిస్తున్న రాజ్ కుమార్ రెండు గంట‌ల వ్య‌వ‌ధిలో ఆరు ప్రాణాల‌ను తీయ‌డం తెల్లారే స‌రికి….. ఈ వార్త దావానంలో వ్యాపించ‌డంతో సంచ‌ల‌న రేపింది. స్థానికంగా అంద‌రిలో నూ క‌ల‌క‌లం రేపింది. త‌న పిల్ల‌ల‌న్న క‌నిక‌రం కూడా లేకుండా ధారుణంగా హ‌త్య చేయ‌డం స్థానికుల్లో తీవ్ర ఆగ్ర‌హావేశాల‌కు కార‌ణ‌మైంది. గ‌తంలో 17 ఏళ్ల మైన‌ర్ బాలిక‌పై జ‌రిగిన అత్యాచ‌ర ఘ‌ట‌న‌లో పోలీసులు రాజ్ కుమార్ అనే వ్య‌క్తిని అరెస్టు చేసి రిమాండ్ కు త‌ర‌లించారు. గ‌త నెలలో బేయిల్ పై విడుద‌లైన నాటి నుంచి పోక్సో కేసు కార‌ణంగానే త‌న‌కు ఇబ్బందులు చుట్టుముట్టాయ‌న్న అప వాద‌ను ఎదుర్కొంటున్న నిందితుడిలో ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెచ్చుకుంది. త‌న కుటుంబ స‌భ్యుల‌తో పాటు ఫోక్సో కేసు పెట్టింద‌న్న కోపంతో ఆ బాలిక కుటుంబ స‌భ్యుల‌పై తీవ్రంగా క‌క్ష పెంచుకున్నారు. స‌మ‌యం కోసం ఎదురు చూసిన రాజ‌కుమార్ శుక్ర‌వారం అర్ధ‌రాత్రిని త‌న ప్ర‌ణాళికను అమ‌లు చేసేందుకు నిర్ణ‌యం తీసుకున్నారు. రాత్రి 11 గంట‌ల నుంచి రెండు గంట‌ల నుంచి నిందితుడు క‌ర్క‌షంగా వ్య‌వ‌హ‌రించాడు. రెండు గంట‌ల వ్య‌వ‌ధిలో ఆరుగురి ప్రాణాలు తీశార‌ని పోలీసులు ప్రాథ‌మికంగా గుర్తించారు.

త‌ల్లిదండ్రుల‌కు స‌మాచారం…..

ఆరు హ‌త్య‌ల‌కు చేసిన అనంత‌రం స్వ‌యంగా త‌ల్లితండ్రుల‌కు ఫోన్ ద్వారా తాను ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్నట్లు స‌మాచారం ఇచ్చి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. రెండు గంట‌ల వ్య‌వ‌ధిలో ఒకే చోట ముగ్గురిని,మరొకచోట ముగ్గురిని హతమార్చాను” అంటూ తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పారు. ఈ విష‌యం పోలీసుల‌కు తెలియ‌డంతో రాత్రి గ్రామంలో పెద్ద ఎత్తున అల‌జ‌డి రేగింది భారీ బందోబ‌స్తుతో పోలీసులు దైవాలగూడ గ్రామానికి చేరుకున్నారు. ఈ మార‌ణ కాండ‌కు దారి తీసిన ప‌రిస్థితుల‌పై ఆరా తీయ‌డంపై దృష్టి పెట్టారు. ఈ నేప‌థ్యంలో పోలీసు ఉన్న‌తాధికారులు కూడా షాక్ కు గుర‌య్యేలా స‌మాచారం అందింది.

పోలీసుల నిర్ల‌క్ష్యం….

పోక్సో కేసులో బేయిల్ ద‌క్కిన నాటి నుంచి కేసుకు కార‌ణ‌మైన బాలిక‌తో పాటు ఆ బాలిక కుటుంబ సభ్యుల‌ను హెచ్చ‌రిస్తూ వ‌చ్చారు. గ‌తంలో బాలిక తండ్రి హత్య‌కు గురి కావ‌డంతో ఆ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ బాధిత కుటుంబాన్ని భ‌య భ్రాంతుల‌కు గురి చేశారు. పోలీసుల దృష్టికి బాధితులు ఈ విష‌యాన్ని తీసుకెళ్లినా పోలీసులు స్పందించ‌క‌పోవ‌డం….బాధిత కుటుంబానికి బాస‌ట‌గా నిలువ‌క పోవ‌డం వంటి అంశాల‌ను గ్రామ‌స్తులు ప్ర‌స్తావిస్తున్నారు.

పోలీసులు ముందు జాగ్ర‌త్త‌గా నిందితుడిని క‌ఠినంగా హెచ్చ‌రించి ఉంటే ఈ ప‌రిస్థితి వ‌చ్చేది కాద‌ని గ్రామస్తులు అంటున్నారు. పోలీసుల తీరును నిర‌సిస్తూ గ్రామ‌స్తులు షాబాద్ పోలీస్ స్టేష‌న్ ముందు ప్ర‌ధాన ర‌హ‌దారిపై రాస్తారోకో నిర్వ‌హించారు. ఈ ఘ‌ట‌న‌లో బాధిత కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించేందుకు మాజీ మంత్రి స‌బిత‌, మాజీ ఎమ్మెల్యే ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డి, ప్ర‌వీణ్ కుమార్ లు అక్క‌డికి వెళుతుంటే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చ‌ర్చ‌నీయంశంగా మారింది. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నారా…… లేరా అన్న‌ది ఇప్పుడు అంద‌రిలో చ‌ర్చ‌కు దారి తీస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *