NewsInn

News in a Click

ఒక్కో హాస్టల్ కి కోటి రూపాయలు మంజూరు

ఒక్కో హాస్టల్ కి కోటి రూపాయలు మంజూరు

(చెన్నై,న్యూస్ఇన్‌)

ముఖ్య‌మంత్రి విజ‌య్ జోసెఫ్ అక‌స్మికంగా విద్యార్థుల హాస్ట‌ల్ త‌నిఖీ చేయ‌డం…. రాష్ట్రంలోని సంక్షేమ‌ హాస్ట‌ళ్ల లో స‌మూల మార్పుల‌కు కార‌ణ‌మైంది. హాస్ట‌ల్ విద్యార్థులు త‌మ స‌మ‌స్య‌ల‌ను సీఎం ముందు ఎక‌రువు పెట్ట‌డంతో…. ఆ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి స‌మీక్ష నిర్వ‌హించారు. యుద్ధ ప్రాతిపదికన హాస్టల్ విద్యార్థులకు కావలసిన సదుపాయాలు అన్నిటిని వారం రోజులుగా తమిళనాడులో ఉన్నటువంటి 1000 కి పైగా ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ అన్నిటికీ అభివృద్ధి కోసం సత్వనమే చర్యలు తీసుకోవాలని సూచించారు.

హాస్టల్ లో లైబ్రరీ , వ్యాయామశాల తో పాటు థియేటర్ స్థాయి గదులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఆ కారణంగా సెలవులు పెట్టి హాస్టల్ విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించే ప్రతి ఒక్కరిని భవిష్యత్తులో సస్పెండ్ చేస్తారని హెచ్చ‌రించారు.

బాలుర బాలికల ప్రతి హాస్టల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశం

తాగునీటి కోసం ప్రతి హాస్టల్లో ఒక ఆర్ఓ ప్లాంట్ ను వెయ్యి లీటర్ల కెపాసిటీది ఏర్పాటు చేయాలని సూచించారు.

హాస్టల్ విద్యార్థులకు సైతం ప్రైవేటు పాఠశాల తరహా వారి యొక్క ప్రయాణానికి ప్రభుత్వ బస్సు సౌకర్యాన్ని ఉదయం సాయంత్రం అందించాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *