NewsInn

News in a Click

ONGC గ్యాస్‌ లీక్‌…ఎగిసి ప‌డుతున్న మంట‌లు

పరిస్థితులు పర్యవేక్షిస్తున్న ఎంపీ,కలెక్టర్, ఎస్పీ

అదుపులోనే ఉంది….క‌లెక్ట‌ర్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

ONGC గ్యాస్ లీక్ పై ప్ర‌భుత్వం యుద్ధ ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లు చేప‌ట్టింది. భారీ ఎత్తున మండ‌లు ఎగిసి ప‌డుతుండ‌డంతో స‌మీపంలోని 5 కిలో మీట‌ర్ల ప‌రిధిలో నివాసం ఉంటున్న ప్ర‌జ‌ల‌ను అధికారులు అక్క‌డి నుంచి ఖాళీ చేయించారు. గ్యాస్ లీకేజీతో ఏర్ప‌డినే మంట‌ల‌తో భారీగా శ‌బ్దాలు వినిపిస్తున్నాయి. ఈ ప్ర‌మాదంపై ONGC స్పందించింది. ఎలాంటి ప్రాణ న‌ష్టం జ‌రుగ‌లేద‌ని స్ప‌ష్ట‌త ఇస్తూ…ప‌రిస్థితిని నిపుణులు ఎప్పక‌ప్పుటు స‌మీక్షిస్తున్నార‌ని వెల్ల‌డించింది.మంట‌ల‌ను అదుపు చేసేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు వివ‌రించింది.

అదుపులోనే ఉంది….క‌లెక్ట‌ర్

మల్కిపురం (మం) ఇరుసుమండలో ONGC గ్యాస్‌ లీక్‌. గ్యాస్‌ లీకై 100 అడుగుల పైకి ఎగిసిపడుతున్న మంటలు. బ్లో అవుట్‌ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన కలెక్టర్‌ మహేష్‌ కుమార్‌. 1993 నుంచి ఆపరేషన్‌లో ఉన్న బావిలో బ్లో అవుట్‌ జరిగింది. 2,500 మీటర్ల లోతులో నుంచి గ్యాస్‌ తీస్తుండగా ప్రమాదం. అనుకున్న దానికంటే ఎక్కువ గ్యాస్‌ బయటకు వచ్చింది. ఒక గంటపాటు గ్యాస్ మాత్రమే బయటకు వచ్చింది. మధ్యాహ్నం 12.30 గంటలకు ఫైర్‌ స్టార్ట్‌ అయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *