NewsInn

News in a Click

మూడో టీ-20 లో 10 ఓవ‌ర్ల‌లోనే భార‌త్ విజ‌యం

మూడో టీ-20 లో 10 ఓవ‌ర్ల‌లోనే భార‌త్ విజ‌యం

మ‌రోసారి న్యూజీలాండ్ కు అభిషేక్ షాక్

భార‌త బౌల‌ర్ల క‌ట్టుదిట్ట‌మైన బౌలింగ్

(స్పోర్ట్స్ డెస్క్ , న్యూస్ఇన్‌)

భార‌త్, న్యూజీలాండ్ జ‌ట్ల మ‌ద్య జ‌రుగుతున్న మూడో టీ-20 మ్యాచ్ లో భార‌త జ‌ట్టు మూడో వ‌న్డేలో న్యూజీలాండ్ ను చిత్తు చేసింది. న్యూజీలాండ్ జ‌ట్టు నిర్ణీత‌20 ఓవ‌ర్ల‌లో 153 ప‌రుగులు చేయ‌గా భార‌త కేవ‌లం 10 ఓవ‌ర్ల‌లో కేవ‌లం రెండు వికెట్లు కోల్పోయి 155 ప‌రుగులు చేసి భార‌త ఇన్నింగ్స్ లో అభిషేక్ శ‌ర్మ మ‌రోసారి త‌న బ్యాట్ తో న్యూజీలాండ్ బౌల‌ర్ల‌కు చుక్కులు చూపించారు. కెప్ట‌న్ సూర్య‌కుమార్ యాద‌వ్ కూడా వ‌రుస‌గా రెండో మ్యాచ్ లో అర్ధ‌సెంచ‌రీ చేసి జ‌ట్టుకు విజ‌యాన్ని అందించారు.

అంతుకు ముందు భార‌త బౌల‌ర్లు న్యూజీలాండ్ బ్యాట్స్ మెన్ల‌ను క‌ట్టడి చేశారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భార‌త జ‌ట్టు నిర్ణ‌యం స‌రైందే అని బౌల‌ర్లు త‌మ ప‌టిష్ట‌మైన బంతుల‌తో నిరూపించారు. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో న్యూజిలాండ్ జ‌ట్టు 9 వికెట్లు కోల్పోయి 153 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. ఫాంలో ఉన్న గ్లేన్ ఫిలిప్స్, మార్క్ చాప్ మెన్ లు మాత్ర‌మే భార‌త జ‌ట్టు బౌలింగ్ ను ప్ర‌తిఘ‌టించి ప‌రుగులు రాబ‌ట్టారు. ఫిలిప్స్ 40 బంతుల్లో 48 ప‌రుగులు చేశారు.చాప్ మ‌న్ 23 బంతుల్లో 32 ప‌రుగులు చేశారు.న్యూజీలాండ్ జ‌ట్టు బ్యాటింగ్ మొద‌లు పెట్టిన నుంచి వ‌రుస‌గా వికెట్లు కోల్పోవ‌డంతో పెద్ద స్కోరును అందుకోలేక‌పోయింది. భార‌త బౌల‌ర్ల‌లో బూమ్రా, ర‌వి బిష్ణోయ్ లు త‌మ కోటాలో 17,18 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి స‌గం టీంను పెవిలియ‌న్ చేర్చారు. వీరికి ఇత‌ర బౌల‌ర్ల స‌హాకారం కూడా ద‌క్క‌డంంతో 153 ప‌రుగులు మాత్రమే ఆ జ‌ట్టు చేసింది.అనంత‌రం బ్యాటింగ్ మొద‌లు పెట్టిన భార‌త జ‌ట్టు మొద‌టి బంతికే సంజుశాంస‌న్ వికెట్ కోల్పోయింది.

ఆ త‌రువాత మొద‌టి వ‌న్డే లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన అభిషేక్ శ‌ర్మ‌,రెండో వ‌న్డే హీరో ఇషాన్ కిష‌న్ లు న్యూజీలాండ్ బౌల‌ర్ల‌కు ఆడుకున్నారు. అభిషేక్ శ‌ర్మ మ‌రోసారి ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు బౌల‌ర్ల‌పై విశ్వ‌రూపం చూపారు 14 బంతుల్లోనే 50 ప‌రుగులు పూర్తి చేసుకున్నారు. ఇషాన్ కిష‌న్ 13 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్ ల‌తో 28 ప‌రుగులు చేసి ఔట‌య్యారు. అప్పుడు భార‌త జ‌ట్టు స్కోరు 53 ప‌రుగులు ఆ త‌రువాత క్రీజ్ లోకి వ‌చ్చిన కెప్ట‌న్ సూర్య‌కుమార్ యాద‌వ్, అభిషేక్ శ‌ర్మ‌లు మ‌రో్సారి న్యూజీలాండ్ బౌల‌ర్ల ఆట‌లు సాగ‌నివ్వ‌లేదు. సూర్య‌కుమార్ యాద‌వ్ 26 బంతుల్లో 57 ప‌రుగులు చేశారు. మ‌రో వికెట్ ప‌డ‌కుండా అ|భిషేక్ శ‌ర్మ 20 బంతుల్లో 68 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. అభిషేక్ 7 ఫోర్లు 5 సిక్ల‌ర్ల‌తో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడారు. మూడో టీ-20 లో కూడా భార‌త జ‌ట్టు విజ‌యం సాధించ‌డంతో సీరీస్ లో 3-0 ఆధిక‌త్య సాధించింది. న్యూజీలాండ్ నిర్దేశించిన ల‌క్ష్యాన్ని భార‌త జ‌ట్టు ప‌ది ఓవ‌ర్లు పూర్తి కాకుండానే ముగించారు.

స్కోర్ వివ‌రాలు…..
న్యూజీలాండ్ 20 ఓవ‌ర్ల‌లో 153-9
ఇండియా 10 ఓవ‌ర్ల‌లో 155-2

అభిషేక్ శ‌ర్మ 20 బంతులు 68 ప‌రుగులు
సూర్య‌కుమార్ యాద‌వ్ 26 బంతులు 57 ప‌రుగులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *